AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపు నర్సాపూర్ కు సీఎం కేసీఆర్..ఆరో విడత హరిహారానికి శ్రీకారం

తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపడుతున్న హ‌రిత‌హారం ఆరో విడత కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్ లో మొక్కలు నాటి హరిహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం 11గంటలకు స్థానిక అర్బన్‌ పార్కులో సీఎం మొక్క నాటుతారని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు.

రేపు నర్సాపూర్ కు సీఎం కేసీఆర్..ఆరో విడత హరిహారానికి శ్రీకారం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 24, 2020 | 4:56 PM

Share

తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపడుతున్న హ‌రిత‌హారం ఆరో విడత కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్ లో మొక్కలు నాటి హరిహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం 11గంటలకు స్థానిక అర్బన్‌ పార్కులో సీఎం మొక్క నాటుతారని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. అర్బన్‌ పార్కులో నిర్మించిన ప్రధానగేటు, బ్రిడ్జి, ఔషధ మొక్కలు, వాచ్‌టవర్‌ను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పీసీసీఎఫ్‌ శోభ, కలెక్టర్‌ ధర్మారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు.

ఇక ప్రభుత్వం ఆరో విడత హరిత హారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జంగల్‌ బచావో.. జంగల్‌ బడావో అని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన నినాదస్ఫూర్తితో అందరూ హరితహారంలో మమేకం కావాలని కోరారు. ఈ విషయమై ప్రజాప్రతినిధులకు మంగళవారం లేఖ రాశారు. ఐదు విడుతల్లో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఆరో విడుత తెలంగాణకు హరితహారాన్ని విజయవంతం చేయాలంటూ సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కోరారు.

రాష్ర్టంలోని అన్ని జాతీయ‌, రాష్ర్ట ర‌హ‌దారుల వెంబడి నిరంతరాయంగా చెట్ల పెంప‌కం చేపట్టాలని ముఖ్య‌మంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ర‌హ‌దారుల వెంట ప్ర‌తి 30 కిలోమీట‌ర్ల దూరానికి ఒక న‌ర్స‌రీని ఏర్పాటు చేయాల‌ని సీఎం అధికారులకు సూచించారు. అలాగే ఈసారి హెచ్ఎండీఏ పరిధిలో 5 కోట్ల మొక్కలు.. జీహెచ్ఎంసీ పరిధిలో 2.5 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించింది. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని హరితహారం కోసం 12,500 నర్సరీల్లో మొక్కలు రెడీగా ఉన్నాయి. ప్రతి ఇంటికి ఆరు మొక్కలను ఉచితంగా అందిచనున్నారు.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా