ఏపీ సచివాలయ పోస్టుల రాత పరీక్షలు ఎప్పుడంటే..!

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది.

ఏపీ సచివాలయ పోస్టుల రాత పరీక్షలు ఎప్పుడంటే..!
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2020 | 7:30 AM

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. జూలై చివరి వారంలో పరీక్షలు జరపాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఈ నేథ్యంలో పరీక్షల నిర్వహణపై పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఆధ్వర్వంలో ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ పరీక్షలు కూడా జూలైలోనే ఉండటంతో.. సచివాలయ పరీక్షలకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తుది తేదీలను ప్రకటించాలని వారు నిర్ణయించారు.

కాగా 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ 14 రకాల పరీక్షలను జూలై చివరిలో ప్రారంభించి 8 రోజులలో పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్షలపై త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

Read This Story Also: ”సిరి.. నువ్వు మా బాబాయ్‌వా”.. నవ్వులు పూయిస్తోన్న అల్లు అయాన్ వీడియో..!