Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: ఏపీకి వందేభారత్ స్లీపర్ రైలు.. ఆ రూట్‎లోనే ఫిక్స్..?

నరసాపురం రైల్వేస్టేషన్‎లోని పలు విభాగాల్లో తనిఖీలు నిర్వహించిన విజయవాడ డీఆర్ఎం నరేంద్ర పాటిల్.. కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. పెండింగ్‎లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన ఆయన.. వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కే ముందుగా ట్రాక్ సామర్ధ్యాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు చెప్పారు. అలాగే నరసాపురం - గుంటూరు మధ్య నడిచే ప్యాసింజర్‎ను..

Vande Bharat: ఏపీకి వందేభారత్ స్లీపర్ రైలు.. ఆ రూట్‎లోనే ఫిక్స్..?
Vande Bharat AC Sleeper
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 14, 2023 | 5:31 PM

నరసాపురం, అక్టోబర్ 14: ఏపీ రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్ అందించనుంది రైల్వేశాఖ. రాష్ట్రానికి వందేభారత్ స్లీపర్ రైలును కేటాయించినట్టు తెలుస్తోంది. నరసాపురం-బెంగళూరు మధ్య ఈ వందేభారత్ స్లీపర్ రైలు నడిస్తుందని సమాచారం. ఇది పట్టాలెక్కగానే ఈ రెండు రూట్ల మధ్య ప్రయాణ భారం 10 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. వందేభారత్ స్లీపర్ రైలును ట్రాక్ సామర్ధ్యం బట్టి గుంటూరు లేదా ఒంగోలు మీదుగా నడపాలని ఆలోచిస్తున్నారు. అయితే ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇటీవల నరసాపురం రైల్వేస్టేషన్‎లోని పలు విభాగాల్లో తనిఖీలు నిర్వహించిన విజయవాడ డీఆర్ఎం నరేంద్ర పాటిల్.. కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. పెండింగ్‎లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన ఆయన.. వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కే ముందుగా ట్రాక్ సామర్ధ్యాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు చెప్పారు. అలాగే నరసాపురం – గుంటూరు మధ్య నడిచే ఫాస్ట్ ప్యాసింజర్‎ను తిరిగి పునరుద్దరిస్తామని విజయవాడ డీఆర్ఎం చెప్పారు. అటు గతంలో నడిచిన నరసాపురం -విశాఖపట్నం లింకు ఎక్స్‌ప్రెస్‌ను రాత్రి సమయంలో నడిచే ప్రతిపాదన కూడా ఉందన్నారు. బెంగళూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఇకపై రెగ్యులర్ చేసే ఆలోచన ఉందని.. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను సైతం నరసాపురం వరకు పొడిగించేందుకు ఆమోదం వచ్చిందన్నారు.

మరోవైపు వందేభారత్ స్లీపర్ రైళ్లను అత్యాధునిక డిజైన్లతో రూపొందిస్తోంది కేంద్ర రైల్వేశాఖ. ప్రతీ రైలులోనూ 857 బెర్తులు ఉండనున్నాయి. ఇక కోచ్‎కు వచ్చి మూడు టాయిలెట్లు, ఒక మినీ ప్యాంట్రీ ఉంటాయి. అలాగే దివ్యాంగులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ర్యాంప్‌లను సైతం ఏర్పాటు చేయనుంది రైల్వే శాఖ. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ రైళ్లు 2024 మార్చికల్లా పట్టాలెక్కనున్నాయి. కాగా, ఇప్పటికే ఏపీలో నాలుగు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం కాగా, మరొకటి సికింద్రాబాద్-తిరుపతి, ఇంకోటి విజయవాడ-చెన్నై, మరొకటి కాచిగూడ-యశ్వంత్‎పూర్ రూట్లలో పరుగులు పెడుతున్నాయి. ఇక ఈ నాలుగు రైళ్లకు ఎక్కువ ప్రజాదరణ ఉంది.

వందేభారత్ స్లీపర్ కోచ్ ఇలా..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా
హైస్పీడ్ రైలు.. హైదరాబాద్ నుండి బెంగళూరు కేవలం 2 గంటల్లోనే..!
హైస్పీడ్ రైలు.. హైదరాబాద్ నుండి బెంగళూరు కేవలం 2 గంటల్లోనే..!
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతిక..బ్యూటిఫుల్ ఫొటోస్
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతిక..బ్యూటిఫుల్ ఫొటోస్
బాహుబలి సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
బాహుబలి సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
జపాన్‌ను భయపెడుతున్న అతి భారీ భూకంపం.. సునామీ కూడా..!
జపాన్‌ను భయపెడుతున్న అతి భారీ భూకంపం.. సునామీ కూడా..!
సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవ
సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవ
వాహనదారులకు షాక్‌.. ఈ కారు ధర రూ.62 వేలు పెంపు..ఏ మోడల్‌కు ఎంతంటే
వాహనదారులకు షాక్‌.. ఈ కారు ధర రూ.62 వేలు పెంపు..ఏ మోడల్‌కు ఎంతంటే
మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు
మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు