Rammohan Naidu: తండ్రైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. కింజారపు ఇంట వెల్లువిరిసిన సంబరాలు
శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇంట మంగళవారం ఆనందం వెల్లువిరిసింది. రామ్మోహన్ నాయుడు సతీమణి శ్రావ్య మంగళవారం ఉదయం ఢిల్లీలోనీ ఫోర్టిస్ ప్రసూతి ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మ నిచ్చింది. దీంతో దివంగత నేత ఎర్రన్నాయుడే మళ్ళీ పుట్టడంటూ కుటుంబసభ్యులు సంభరపడుతున్నారు.

శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇంట మంగళవారం ఆనందం వెల్లువిరీసింది. మంత్రి రామ్మోహన్ నాయుడుకి వారసుడు పుట్టాడమే దీనికి కారణం. రామ్మోహన్ నాయుడు సతీమణి శ్రీశ్రావ్య మంగళవారం ఉదయం ఢిల్లీలోనీ ఫోర్టిస్ ప్రసూతి ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మ నిచ్చింది. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. టిడిపి మాజీ మంత్రి, మాడుగుల MLA అయిన బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తె శ్రీశ్రావ్యతో రామ్మోహన్ నాయుడుకు 2017 జూన్ 14న రామ్మోహన్ నాయుడుకి వివాహం జరిగింది. 2021 జనవరి 30న మొదటి సంతానంగా వీరికి మిహిర అన్వి శివంకృతి అనే కుమార్తె పుట్టింది.
రెండవ సంతానంగా రామ్మోహన్ నాయుడు, శ్రీశ్రావ్య జంటకు మంగళవారం కుమారుడు పుట్టాడు. దీంతో 2025లో స్వర్గీయ ఎర్రన్నాయుడే మళ్లీ తమ ఇంటికి వచ్చాడని కింజరాపు కుటుంబం సంబరపడుతోంది. రామ్మోహన్ నాయుడుకి తన తండ్రి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు అంటే చాలా ఇష్టం. అయితే రామ్మోహన్ నాయుడు యుక్త వయసులో వుండగానే 2012నవంబర్ 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో కింజరాపు ఎర్రన్నాయుడు మృతి చెందారు. దాంతో అతని రాజకీయ వారసుడుగా రామ్మోహన్ నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు. వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీగా పోటీచేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రస్తుతం NDA ప్రభుత్వంలో అతి చిన్న వయసులోనే కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
అయితే ఇప్పుడు తనకు పుత్రుడు జన్మించడంతో పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు రామ్మోహన్ నాయుడు. తన తండ్రి ఎర్రన్నాయుడే తమ ఇంటికి వచ్చారని ఆనంద పడుతున్నారు. ఇటు కింజరాపు కుటుంబం, అటు బండారు కుటుంంబం సంబర పడుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
