TTD: సీనియర్ సిటీజన్లకు టీటీడీ గుడ్ న్యూస్.. ఆ టికెట్ల విడుదలపై కీలక ప్రకటన..
సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త అందించింది. వారి కోటా కింద నవంబర్ నెల ఆన్లైన్ దర్శనం టికెట్లను..
సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త అందించింది. వారి కోటా కింద నవంబర్ నెల ఆన్లైన్ దర్శనం టికెట్లను అక్టోబర్ 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ పేర్కొంది. మరోవైపు అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ప్రత్యేక దర్శనం టికెట్లు(రూ. 300), తిరుమల అకామిడేషన్ డిసెంబర్ కోటాను ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఈ టికెట్లను అక్టోబర్ 27న విడుదల చేయాల్సి ఉండగా.. భక్తుల సౌకర్యార్ధం ఒక్క రోజు ముందుగా రిలీజ్ చేయబోతున్నారు.
సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు దర్శనం కోసం ఎలా బుక్ చేసుకోవాలి..?
- టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి
- వయో పరిమితి 65 సంవత్సరాలకుపైగా
- ఐడీ ఫ్రూప్గా ఆధార్ కార్డు ఉండాలి
- ఉచితంగా దర్శన టికెట్
- సీనియర్ సిటిజన్ వెంట ఒక వ్యక్తికి అనుమతి (ఎవరి సహాయం లేకుండా ఉండకపోతే, నిలబడకపోతే)
- అటెండర్గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి
- 80 ఏళ్లు దాటిన వారి సహాయకులకు కూడా అనుమతి
Announcement:
Senior Citizens / Physically challenged quota for the month of November 2022 will be available for booking w.e.f. 26-10-2022 03:00 PM.
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) October 24, 2022
In view of Administrative reasons, the Special Entry Darshan (Rs.300) and Tirumala Accommodation December-2022 Quota to be released on 26-10-2022 10:00 AM and 27-10-2022 10:00 AM is cancelled. The further quota release dates will be intimated shortly.
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) October 22, 2022