AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారి కాచిన మృత్యువు.. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వృద్ద దంపతులు బలి

Lorry Hits Bike in Prakasam District: ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా, వారి మనవడు గాయపడ్డాడు. కందుకూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధ జంట అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు..

దారి కాచిన మృత్యువు.. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వృద్ద దంపతులు బలి
Singarayakonda Road Accident
Fairoz Baig
| Edited By: |

Updated on: Jun 05, 2026 | 4:25 PM

Share

సింగరాయకొండ, జూన్ 5: ప్రకాశంజిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వృద్ద దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను షేక్ అల్లి సాహెబ్ (70) షేక్ నాగూర్ బి (60)లుగా గుర్తించారు. కందుకూరులో ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో అమ్మమ్మ, తాతయ్యలను బైక్‌పై ఎక్కించుకుని మనవడు షేక్ నాగూర్ వలి (28) తీసుకొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సింగరాయకొండ దగ్గర జాతీయ రహదారిలోని ఎమర్జెన్సీ ల్యాండ్ సమీపంలో కళ్యాణ మండపం దగ్గర రోడ్డు దాటుతుండగా బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే వృద్ద దంపతులు అల్లిసాహెబ్‌, నాగూర్‌బిలు మృతి చెందగా.. మనవడు నాగూర్‌వలికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామానికి చెందిన దంపతులు షేక్ అల్లి సాహెబ్ (70) షేక్ నాగూర్ బి (60) గురువారం కందుకూరులోని ఓ శుభకార్యానికి హాజరయ్యారు. తమ మనవడితో కలిసి బైక్‌పై తిరిగి మూలగుండపాడులోని తమ కుమార్తె దగ్గరకు వస్తున్నారు. ఇంతలో కనుమళ్ళ దగ్గర హైవేపై నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వస్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వృద్ద దంపతులు లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే చనిపోయారు. మనవడు నాగూర్‌వలికి స్వల్ప గాయాలయ్యాయి. వృద్ధ దంపతుల మృతదేహాలు హైవే రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఘటనపౌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us