AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచే ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ.. పూర్తి వివరాలివే..

తిరుమల శ్రీవారి (Tirumala Srivari)ని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం (Sarvadarshanam) టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ (TTD) నిర్ణయించింది

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచే ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ.. పూర్తి వివరాలివే..
Basha Shek
|

Updated on: Feb 14, 2022 | 6:30 AM

Share

తిరుమల శ్రీవారి (Tirumala Srivari)ని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం (Sarvadarshanam) టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. ఈ మేరకు రేపటి (ఫిబ్రవరి 15) నుంచి ఈ టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. 16వ తేదీ దర్శనం కోసం 15న ఉదయం 9 గంటలకు టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది. తిరుపతి(Tirupati)లోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. నిత్యం 15 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చెయ్యాలని టీటీడీ  ఏర్పాట్లు చేసింది . కరోనా కారణంగా 2020 మార్చి తర్వాత ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపేసింది. ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో భక్తులకు సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు టీటీడీ సమాయత్తమైంది. కాగా రెండేళ్ల తర్వాత మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేస్తోంది.

రోజూ 15వేల టికెట్లు..

గత ఏడాది రోజుకు 2వేల చొప్పున ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టికెట్లు జారీ చేసినా.. కొవిడ్‌కు తోడు భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ వాటిని నిలిపేసింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో మాత్రమే రోజుకు 5వేల చొప్పున శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ప్రతి నెల విడుదల చేస్తోంది.ప్రస్తుతం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 టికెట్లు), వర్చువల్ సేవా, వీఐపీ సిఫార్సులు, ఆన్ లైన్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. దీంతో ప్రతిరోజు 25-30 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో రోజు15 వేల టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ సిద్ధమైంది. దీంతో నిత్యం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 40 వేలు దాటి పోయే అవకాశం ఉంది. 16వ తేదీన శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునే వారు.. ఒఖ రోజు ముందుగానే టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read:PSLV-C52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్..

GT IPL 2022 Auction: సిద్ధమైన గుజరాత్ సైన్యం.. తొలి సీజన్‌లో అద్భుతాలు చేసే హార్దిక్ టీం ఇదేనా..

MI, IPL 2022 Auction: ఐదోసారి ట్రోఫీకి సిద్ధమైన రోహిత్ సేన.. ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీ ఎలా ఉందో చూశారా?

Follow Us
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
అదృష్టం వరించింది.. జూన్ 17 నుంచి వీరి ఇంట ధన వర్షం..డబ్బే డబ్బు
అదృష్టం వరించింది.. జూన్ 17 నుంచి వీరి ఇంట ధన వర్షం..డబ్బే డబ్బు
eRZL హైడ్రేషన్ డ్రైవ్: గుడివాడలో ఎలక్ట్రోలైట్ అవగాహన
eRZL హైడ్రేషన్ డ్రైవ్: గుడివాడలో ఎలక్ట్రోలైట్ అవగాహన
UGC NET 2026 రాసేవారికి అలర్ట్.. ఈ స్లిప్ తప్పనిసరిగా చెక్ చేయండి
UGC NET 2026 రాసేవారికి అలర్ట్.. ఈ స్లిప్ తప్పనిసరిగా చెక్ చేయండి