AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: ఆ రైతుల‌కు టీటీడీ గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

జాతీయ గో మ‌హాస‌మ్మేళ‌నం ప్రారంభోత్స‌వంలో టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కీలక కామెంట్స్ చేశారు. నేల‌త‌ల్లిని ర‌క్షించ‌డానికే జాతీయ గో మ‌హాస‌మ్మేళ‌నం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

TTD: ఆ రైతుల‌కు టీటీడీ గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
Yv Subba Reddy
Ram Naramaneni
|

Updated on: Oct 30, 2021 | 4:03 PM

Share

జాతీయ గో మ‌హాస‌మ్మేళ‌నం ప్రారంభోత్స‌వంలో టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కీలక కామెంట్స్ చేశారు. నేల‌త‌ల్లిని ర‌క్షించ‌డానికే జాతీయ గో మ‌హాస‌మ్మేళ‌నం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గో ఆధారిత వ్య‌వ‌సాయ రైతుల‌కు టీటీడీ అండ‌గా ఉంటుందని చెప్పారు. రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర చెల్లించి గో ఆధారిత ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేస్తామని చెప్పారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాల‌ని టీటీడీ పాల‌క‌ మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. సీఎం జ‌గ‌న్‌ సూచనల మేరకు టీటీడీ పాల‌క మండ‌లి సనాతన హిందూ ధర్మ ప్రచారం చేస్తూనే, గో సంరక్షణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వ‌హిస్తోందని చెప్పారు. వందల సంవత్సరాల నాటి సంప్రదాయాన్ని పునరుద్ధరించి..  గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంట‌ల‌తో  శ్రీ‌వారికి నైవేద్యం స‌మ‌ర్పిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి  చెప్పారు. ర‌సాయ‌న ఎరువుల‌తో త‌యారుచేసిన‌ దాణా తినే ఆవుల పాల వ‌ల్ల మ‌హిళ‌ల్లో క్యాన్స‌ర్ పెరుగుతోంద‌ని అధ్య‌య‌నాల్లో తేలిందని.. అందువ‌ల్లే సీఎం జ‌గ‌న్‌ ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హిస్తున్నారని తెలిపారు.  దేశం ఆర్థికంగా, ధార్మికంగా, ఆరోగ్యపరంగా బాగుపడాలంటే గో సంరక్షణే ఏకైక  మార్గమన్నారు. గోవులను పూజించడం, సంరక్షించడం మనందరి కర్తవ్యమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

జాతీయ గో మ‌హాస‌మ్మేళ‌నం సందర్భంగా… మహతి కళాక్షేత్రం ప్రాంగణంలో 24 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు స్టాల్స్ టీటీడీ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేయబడుతున్న అగరబత్తులు, ఆయుర్వేద – పంచగవ్య ఉత్పత్తులు, టీటీడీ ప్రచురణలు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్రపటాలను ఉంచారు. గో మహాసమ్మేళనానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి విచ్చేసిన రైతులకు శ్రీనివాసం వసతి సముదాయము, ఎస్.వి.విశ్రాంతి భవనం, పద్మావతి నిలయం, గోవిందరాజస్వామివారి 2,3వ సత్రాల్లో వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో గో సమ్మేళనానికి విచ్చేసిన రైతులకు సాంప్రదాయ భోజనం, త్రాగునీరు అందిస్తున్నారు.

Also Read:  పెళ్లి రోజున భర్తతో ఉన్న అందమైన ఫోటో షేర్ చేసిన చందమామ కాజల్

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా