Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: తిరుమలకు అరుదైన ఘనత..! ఈ ఏడాది అత్యధికంగా భక్తులు సందర్శించిన ఆలయాల్లో రెండో స్థానం..

తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో అరుదైన ఘనత దక్కింది. దేశం మొత్తంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల శ్రీవారి ఆలయం రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఓయో కల్చరల్‌ ట్రావెల్‌ రిపోర్టులో..

TTD: తిరుమలకు అరుదైన ఘనత..! ఈ ఏడాది అత్యధికంగా భక్తులు సందర్శించిన ఆలయాల్లో రెండో స్థానం..
Tirumala Temple
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 27, 2022 | 7:50 PM

తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో అరుదైన ఘనత దక్కింది. దేశం మొత్తంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల శ్రీవారి ఆలయం రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఓయో కల్చరల్‌ ట్రావెల్‌ రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా భక్తులు సందర్శించిన దర్శనీయ, పర్యాటక ప్రాంతాలపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వారణాసి తొలి స్థానాన్ని దక్కించుకుంది. తిరుపతి దేవస్థానం రెండో స్థానంలో నిలిచిందని ఆ సంస్థ పేర్కొంది.

కాగా గత రెండేళ్లుగా కరోనా ఆంక్షలు మూలంగా దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోలేక భక్తులు అవస్థలు పడ్డారు. ఐతే ఈ ఏడాది కరోనా ఆంక్షలను సడలించడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో ఎన్నడూలేని విధంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పర్యాటకుల గదుల బుకింగ్‌ తిరుపతి నగరంలో గతేడాదితో పోలిస్తే ఈసారి 233 శాతం పెరిగినట్లు ఓయో కల్చరల్‌ ట్రావెల్‌ రిపోర్టు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.