AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC-Junior winner: కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ. 50 లక్షలు గెల్చుకున్న ఎనిమిదో తరగతి అమ్మాయి

కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్స్‌లో పంజాబ్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక ఏకంగా రూ.50 లక్షలు గెల్చుకుంది. షో చూడటం మాత్రమేకాదు ఎప్పటికైనా కేబీసీలో పాల్గొనాలని కలలుకన్న ఈ అమ్మాయి అనతికాలంలోనే తన కలను నెరవేర్చుకుంది. వివరాల్లకెళ్తే..

KBC-Junior winner: కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ. 50 లక్షలు గెల్చుకున్న ఎనిమిదో తరగతి అమ్మాయి
KBC-Junior winner Japsimran Kaur
Srilakshmi C
|

Updated on: Dec 27, 2022 | 5:41 PM

Share

కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్స్‌లో పంజాబ్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక ఏకంగా రూ.50 లక్షలు గెల్చుకుంది. షో చూడటం మాత్రమేకాదు ఎప్పటికైనా కేబీసీలో పాల్గొనాలని కలలుకన్న ఈ అమ్మాయి అనతికాలంలోనే తన కలను నెరవేర్చుకుంది. వివరాల్లకెళ్తే.. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన జప్‌సిమ్రన్‌ కేంద్రీయ విద్యాలయలో ఎనిమిదో తరగతి చదువుతోంది. జనరల్ నాలెడ్జ్‌లో అభీష్టం ఉండటం వల్ల కౌన్ బనేగా కరోడ్‌పతిలో పాల్గొనాలని ఉవ్విళ్లూరింది. అంతటితో ఆగకుండా అందుకు దారులు ఏర్పరచుకుంది. తండ్రి సహాయంతో ఎట్టకేలకు కేబీసీలో పాల్గొనేందుకు అవకాశం దక్కించుకుంది.

ఐతే నేరుగా ఈ కార్యక్రమానికి వెళ్లలేదట.. తొలుత రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూలో సత్తా చాటిమరీ కేబీసీలో పాల్గొంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని రెండో రౌండ్‌లో ఇంటర్వ్యూకి హాజరైనట్లు జప్‌సిమ్రన్‌ తెల్పింది. షో వ్యాఖ్యాత అమితాబ్ బచ్చన్‌ను కలవడం, 50 లక్షలను గెలవడం గురించి జప్‌సిమ్రన్ మీడియాతో మాట్లాడుతూ..

‘హాట్‌ సీట్‌లో కూర్చు్న్న తర్వాత ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అని భయపడ్డాను. కానీ అమితాబ్ బచ్చన్‌ సర్ పిల్లలతో చక్కగా మాట్లాడతారు. ఆయనతో మాట్లాడుతుంటే ఆందోళన దానంతట అదే తగ్గిపోతుంది. ఈ ప్రోగ్రాంలో నేను 50 లక్షలు గెల్చుకోవడం చాలా ఆనందంగా ఉందని’ జప్‌సిమ్రన్‌ పేర్కొంది. తన కూతురు సాధించిన విజయాన్ని చూస్తే గర్వంగా అనిపిస్తోందని, మా కుటుంబానికి మాత్రమేకాకుండా, సిటీకి, రాష్ట్రానికి కూడా తను మంచి పేరు తీసుకొచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన కూతురు తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆమె తల్లి గుర్విందర్ కౌర్ అన్నారు. జప్‌సిమ్రన్‌ 10 నెలల వయస్సులోనే మాట్లాడటం మొదలుపెట్టిందని ఆమె తెలిపారు. స్పేస్ సైంటిస్టు అవ్వాలనుకుంటున్న జప్‌సిమ్రన్‌కు మొదటి నుంచి పుస్తకాలు చదవడమంటే అమితాశక్తి అని గుర్విందర్ కౌర్ చెప్పుకొచ్చారు. ఇంత డబ్బు గెల్చుకున్నావ్‌ కదా.. ఈ డబ్బుతో ఏం చేస్తావనే ప్రశ్నకు సమాధానంగా.. మా నాన్నమ్మ మోకాళ్ల ఆపరేషన్‌కు సాయం చేస్తానని, స్పేస్ సైంటిస్ట్ అయిన తర్వాత, పేద పిల్లల చదువుకు సాయం చేస్తానని జప్‌సిమ్రన్‌ తెల్పింది. కాగా కౌన్ బనేగా కరోడ్‌పతి నిబంధనల ప్రకారం జప్‌సిమ్రన్‌కు 18 ఏళ్ల వయసు వచ్చాక 50 లక్షల రూపాయలు అందజేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!