AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతీ ఊరిలో పులివెందుల పంచాయితీలే, ప్రజలు.. మేథావులు స్పందించకపోతే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందన్న బాబు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఊరిలో పులివెందుల పంచాయతీలు చేస్తున్నారని ఆగ్రహించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజలు, మేథావులు స్పందించకపోతే..

ప్రతీ ఊరిలో పులివెందుల పంచాయితీలే,  ప్రజలు.. మేథావులు స్పందించకపోతే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందన్న బాబు
Venkata Narayana
|

Updated on: Feb 18, 2021 | 3:10 PM

Share

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఊరిలో పులివెందుల పంచాయితీలు చేస్తున్నారని ఆగ్రహించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజలు, మేథావులు స్పందించకపోతే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందన్నారు. టీడీపీకి శక్తినివ్వాలని కోరారు చంద్రబాబు. ప్రజల త్యాగాలతో ఏర్పడ్డ విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీకి అండగా నిలవాల్సిన సీఎం, భూములు అమ్ముదామనే ప్రతిపాదన చేయడం అనైతికమన్నారు. భూములెందుకు…స్టీల్‌ప్లాంట్‌నే అమ్మేస్తే పోతుందని వ్యాఖ్యానించారు. అటు విశాఖ స్టీల్‌ప్లాంటు, ఇటు అమరావతి రాజధాని రైతుల త్యాగాన్ని పరిహసిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.

Read also : కుంట శ్రీను. లాయర్ దంపతులు చనిపోతూ చెప్పిన పేరిది. రాజకీయ రచ్చకు ఇదే క్లూ. ఎవరితను.. పుట్టా మధుతో లింకేంటి..?