AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్ అంటూ.. సీఎం జగన్‌పై టీడీపీ నేత సంచలన ట్వీట్..

గత కొద్ది రోజులుగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ పీక్ స్టేజ్‌కు చేరింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కీలక నేతలు ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా సంచలన పోస్టులు పెడుతూ.. సోషల్ మీడియా వార్‌కు తెరలేపుతున్నారు. ఇందులో ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. టీడీపీ, జనసేన పార్టీల అధినేతలను టార్గెట్ చేస్తూ పోస్టులు చేసే విషయం తెలిసిందే. అయితే టీడీపీ నుంచి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ […]

బిగ్ బ్రేకింగ్ అంటూ.. సీఎం జగన్‌పై టీడీపీ నేత సంచలన ట్వీట్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 18, 2019 | 6:38 AM

Share

గత కొద్ది రోజులుగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ పీక్ స్టేజ్‌కు చేరింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కీలక నేతలు ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా సంచలన పోస్టులు పెడుతూ.. సోషల్ మీడియా వార్‌కు తెరలేపుతున్నారు. ఇందులో ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. టీడీపీ, జనసేన పార్టీల అధినేతలను టార్గెట్ చేస్తూ పోస్టులు చేసే విషయం తెలిసిందే. అయితే టీడీపీ నుంచి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇదే విధంగా ట్విట్టర్ ద్వారానే రాజకీయ విమర్శలకు దిగుతున్నారు.

తాజాగా టీడీపీ నేత బోండా ఉమ.. ఏపీ సీఎం జగన్‌పై సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్లు చేశారు. బిగ్ బ్రేకింగ్ అంటూ తన అధికారిక ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో త్వరలో జగన్ బెయిల్ రద్దు అవుతుందని.. సీబీఐ ప్రస్తుతం అదే యోచనలో ఉందంటూ సంచలన పోస్ట్ చేశారు. ఇక విజయ సాయి రెడ్డి లేవనెత్తిన విషయాన్ని కేంద్రం సున్నితంగా తిరస్కరించిందని ఆ పోస్ట్‌లో కామెంట్ పెట్టారు.

గత కొద్దిరోజులుగా టీడీపీ శ్రేణులు.. సీబీఐ త్వరలో సీఎం జగన్‌ బెయిల్ రద్దు చేయనుందంటూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా అదే ట్రోలింగ్‌ను కంటిన్యూ చేస్తూ బోండా ఉమా కూడా ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ చేశారు.

కాగా, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుకు కోరుతూ.. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను.. సీబీఐ కోర్ట్ డిస్మిస్ చేసింది. ప్రతి శుక్రవారం న్యాయస్థానానికి హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింన విషయం తెలిసిందే.