YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రతినిధుల భేటీ.. ఏపీలో పెట్టుబడులపై చర్చ..
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఎఫైర్స్ రెగ్యులేటరీ హెడ్ జే.శ్రీధర్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హెడ్ మసూద్ హుస్సేనీల బృందం.. మంగళవారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
CM YS Jagan – Tata Advanced Systems: ఏపీ సీఎం వైఎస్ జగన్తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ జరిగింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఎఫైర్స్ రెగ్యులేటరీ హెడ్ జే.శ్రీధర్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హెడ్ మసూద్ హుస్సేనీల బృందం.. మంగళవారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై వారు చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని వారికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. పారిశ్రామిక రంగంలో అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా తాము సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టాటా ప్రతినిధులకు సూచించారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలు, తీసుకుంటున్న చర్యల గురించి సవివరంగా వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవెన్, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..