Obulapuram Mining Case: మైనింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. నిందితులకు ఊహించని షాక్.. వాయిదాలకు నో పర్మిషన్..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. నిందితులకు ఊహించని షాకిచ్చింది. డిశ్చార్జ్‌ పిటిషన్లపై విచారణను త్వరగా ముగించి తీర్పు ఇవ్వాలని ఆదేశించింది. ట్రయల్‌ కోర్టు విచారణలో జరుగుతోన్న జాప్యంపై..

Obulapuram Mining Case: మైనింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. నిందితులకు ఊహించని షాక్.. వాయిదాలకు నో పర్మిషన్..
Supreme court
Follow us

|

Updated on: Sep 24, 2022 | 9:15 AM

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. నిందితులకు ఊహించని షాకిచ్చింది. డిశ్చార్జ్‌ పిటిషన్లపై విచారణను త్వరగా ముగించి తీర్పు ఇవ్వాలని ఆదేశించింది. ట్రయల్‌ కోర్టు విచారణలో జరుగుతోన్న జాప్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి తీవ్రంగా స్పందించింది. నిందితులు కోరినా, ఎలాంటి వాయిదాలకు అనుమతించొద్దంటూ సీబీఐ స్పెషల్‌ కోర్టును ఆదేశించింది. అదే సమయంలో ట్రయల్‌ కోర్టు విచారణలో జాప్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణను ఆలస్యం చేసేందుకు నిందితులు అన్నిరకాల ప్రయత్నాలు చేసినట్లుగా భావిస్తున్నట్లు పేర్కొంది. విచారణలో అసలెందుకు జాప్యం జరిగిందో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించింది. ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ రిపోర్ట్‌ ఇవ్వడంతో, దాని ఆధారంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. నిందితుల డిశ్చార్జ్‌ పిటిషన్లపై త్వరగా విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించింది. అయితే, ఎలాంటి వాయిదాలకు ఛాన్సే ఇవ్వొద్దని స్ట్రిక్ట్‌గా చెప్పడంతో కేసు అనూహ్య మలుపు తిరిగినట్టయ్యింది.

కాగా. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కార్యకలాపాలకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. మైనింగ్ ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతిని కోరుతూ కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఓబుళాపురం మైనింగ్ లో లీజు ప్రాంతాన్ని దాటి జరిపారన్న ఆరోపణలపై పనులు నిలిపేయాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. మైనింగ్ ప్రాంతం కర్నాట, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండటంతో బార్డర్స్ ను గుర్తించాలని సూచించింది. లీజు ప్రాంతాన్ని మార్కింగ్ చేసేంత వరకూ మైనింగ్ ను కొనసాగించవద్దని ఆదేశాలిచ్చింది. దీనిపై సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మైనింగ్ లీజు ప్రాంతాలను దాటి పనులు చేసినట్లు నిర్ధారించింది. దీంతో సెంట్రల్ ఎపంవర్డ్ కమిటీ మళ్లీ ప్రారంభించేలా సిఫార్సు చేసింది.

ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణను త్వరగా ముగించాలని ఆదేశించింది. మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్ధన్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు ఈ కేసులో నిందితులుగా ఉండటంతో సుప్రీం ఆదేశాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. దశాబ్దం క్రితం నమోదైన ఈ కేసులో త్వరగా విచారణ పూర్తి చేస్తే ఎలాంటి జడ్జిమెంట్‌ రాబోతుందోనన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం కోసం క్లిక్ చేయండి..

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు