AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: సేనాని పర్యటనకు స్కార్పియోలు సిద్ధం.. టాప్ గేర్‌లో జనంలోకి పవన్

ఇకపై పాలిటిక్స్‌లో స్పీడ్ పెంచనున్నారు పవన్ కల్యాణ్. విజయదశమి నుంచి రాష్ట్ర పర్యటన చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Pawan Kalyan: సేనాని పర్యటనకు స్కార్పియోలు సిద్ధం.. టాప్ గేర్‌లో జనంలోకి పవన్
Pawan Kalyan Tour Updates
Ram Naramaneni
|

Updated on: Jun 12, 2022 | 5:08 PM

Share

Andhra Pradesh: విజయ దశమి నాడు తిరుపతి(Tirupati) నుంచి మొదలయ్యే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రాష్ట్రవ్యాప్త యాత్రకు కొత్త వాహనాలు సిద్ధమయ్యాయి. ఎనిమిది బ్లాక్ కలర్ స్కార్పియోలు మంగళగిరి(Mangalagiri)లోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నాయి. YCP ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని పవన్ నిర్ణయించారు. జనసేనాని పర్యటనకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. వీటికి పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రారంభిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. అక్టోబర్‌ 5న దసరా రోజున తిరుపతి నుంచి ప్రారంభించి ఆరు నెలల్లో రాష్ట్రమంతా పవన్ పర్యటిస్తారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు జనసేన నేతలు పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటనలు ఉండేలా రూట్‌మ్యాప్‌ రూపొందిస్తున్నారు.  రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే జనసేనాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లోనే ఎన్నికలు ఉంటాయనే సంకేతాలు వస్తున్నందున ఆయన స్పీడ్ పెంచారు. దసరా లోపు తాను ఒప్పుకొన్న సినిమా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు పవన్.

ఇంకా ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం