Andhra: మామూలు స్కెచ్ కాదుగా.. ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరికి పాల్పడింది వీళ్లే..
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలా దేవి పొన్నూరు సమీపంలోని చింతలపూడిలో ఒంటరిగా నివసిస్తోంది. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరులో ఉంటారు. ఈ నెల పదిహేనో తేదిన మహా శివరాత్రి కావడంతో ఆమె గుంటూరులోని కొడుకు ఇంటికి వెళ్ళింది. ఆమె గుంటూరు వెళ్ళిన విషయాన్ని సత్తెనపల్లి రాకేష్ తెలుసుకున్నాడు.

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలా దేవి పొన్నూరు సమీపంలోని చింతలపూడిలో ఒంటరిగా నివసిస్తోంది. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరులో ఉంటారు. ఈ నెల పదిహేనో తేదిన మహా శివరాత్రి కావడంతో ఆమె గుంటూరులోని కొడుకు ఇంటికి వెళ్ళింది. ఆమె గుంటూరు వెళ్ళిన విషయాన్ని సత్తెనపల్లి రాకేష్ తెలుసుకున్నాడు. తన స్నేహితులతో కలిసి రెక్కీ నిర్వహించాడు. అంతా అనుకూలంగా ఉందని భావించిన తర్వాత చోరి చేశారు. భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు తీసుకెళ్ళాడు. ఎమ్మెల్యే తల్లి ఇంట్లోనే చోరి జరగడం కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమెరాల సాయంతో చోరికి పాల్పడిన వారిని గుర్తించారు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఏలూరు జిల్లాకు చెందిన రాకేష్ గత కొంత కాలంగా దొంగతనాలు చేస్తున్నాడు. ఇప్పటికే అతనిపై 34 కేసులు నమోదు అయ్యాయి. సొంత జిల్లాలో పోలిసుల నిఘా పెరగడంతో ఇతర జిల్లాలపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో చీరాలోని తన స్నేహితుల వద్దకు చేరుకున్నాడు. ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరికి పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. స్నేహితులతో కలిసి చీరాల బీచ్ లో కారు దొంగిలించారు. ముగ్గురు కలిసి చింతలపూడి చేరుకున్నారు. ప్రమీలా దేవి ఇంట్లో చోరి చేసి ఏలూరు వెళ్ళిపోయారు.
తాము చోరి చేసిన ఆభరణాలను చాట్రగడ్డ సర్పంచ్ రఘుకు ఇచ్చి విక్రయించారు. దీంతో వెండిని కరిగించిన రఘు దిమ్మెలా అచ్చుపోయించాడు. కొన్ని బంగారు ఆభరణాలను రాకేష్ తల్లికి ఇచ్చి భద్ర పరచమని చెప్పాడు. రఘుకి ఆభరణాలు ఇస్తున్న సమయంలో ఫోటో తీసుకున్నాడు. సిసి కెమెరాల సాయంతో ఆధారాలు సేకరించిన పోలీసులు మొదట రాకేష్ ను అదుపులోకి తీసుకున్నారు.
వీడియో చూడండి..
ఆ తర్వాత రాకేష్ ఫోన్ ఆధారంగా రఘుని, రాకేష్ స్నేహితులను గుర్తించి అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 70 లక్షల విలువ చేసే 42 సవర్ల బంగారు. 10.5 కేజీల వెండి, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటితో ఐదు దశాబ్దాల క్రితం వెండితో తయారు చేసిన సరస్వతి విగ్రహాన్ని కరిగించకుండా ఉంచడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
