AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి..

ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్నారు. రాష్ట్ర సర్కార్ తీరుతో అభివృద్ధి లేకుండా పోయిందని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏపీలో ప్రచారం ఊపందుకుంది. కూటమి తరపున ప్రధాని మోదీ రెండు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి..
Modi
Ravi Kiran
|

Updated on: May 06, 2024 | 9:15 PM

Share

ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్నారు. రాష్ట్ర సర్కార్ తీరుతో అభివృద్ధి లేకుండా పోయిందని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏపీలో ప్రచారం ఊపందుకుంది. కూటమి తరపున ప్రధాని మోదీ రెండు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదట రాజమండ్రి సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని ప్రపంచం గుర్తించిందని మోదీ అన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాష్ట్రం కూడా అంతే స్పీడ్‌తో అభివృద్ధి చెందాలని మోదీ తెలిపారు.

కేంద్ర ప్రాజెక్టుల అమలును రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసిందని ప్రధాని ఆరోపించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని.. ఏపీ భవిష్యత్తు కోసం కూటమికి ఓటేయాలని కోరారు.

ఆ తరువాత అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. భారత్ ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిందని అన్నారు. చందమామ దక్షిణ భాగాన జెండా రెపరెపలాడించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. ఏపీ నుంచి అనేకమంది ప్రవాసులు విదేశాల్లో నివసిస్తున్నారని.. భారత్ సాధించిన ఘనతతో వారందరూ ఎంతో గుర్తింపు పొందుతున్నారని మోదీ అన్నారు. ఏపీలో శాండ్, ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నాయని మోదీ ఆరోపించారు. ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల చెరకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోదీ ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో చెరకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామని తెలిపారు.

Follow Us
విద్యార్ధులకు అలర్ట్.. మరో 2 రోజుల్లోనే GATE 2026 ఫలితాలు విడుదల
విద్యార్ధులకు అలర్ట్.. మరో 2 రోజుల్లోనే GATE 2026 ఫలితాలు విడుదల
ఈ చిన్న ట్రిక్​తో ప్రాబ్లమ్ సాల్వ్..!
ఈ చిన్న ట్రిక్​తో ప్రాబ్లమ్ సాల్వ్..!
విరాట్ మనసు గెలుచుకున్న ఆటగాళ్లు వీళ్లే.. మరి కెప్టెన్ ఎవరంటే ?
విరాట్ మనసు గెలుచుకున్న ఆటగాళ్లు వీళ్లే.. మరి కెప్టెన్ ఎవరంటే ?
బ్యాంకుకు వెళ్తున్నారా? బిగ్‌ అలర్ట్‌.. 4 రోజులు బ్యాంకులు బంద్!
బ్యాంకుకు వెళ్తున్నారా? బిగ్‌ అలర్ట్‌.. 4 రోజులు బ్యాంకులు బంద్!
ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సార్లు ప్రేమలో పడతారో తెలుసా?..
ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సార్లు ప్రేమలో పడతారో తెలుసా?..
మార్చి రాగానే తులసి మొక్క ఎండిపోతుందా..? ఈ ఒక్క పని చేయండి...
మార్చి రాగానే తులసి మొక్క ఎండిపోతుందా..? ఈ ఒక్క పని చేయండి...
నిరుద్యోగులకు అలర్ట్.. పదోతరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. పదోతరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు
వారెవ్వా.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషాలిటీ ఇదే మావ..
వారెవ్వా.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషాలిటీ ఇదే మావ..
వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉంది..? ఈ తప్పులు చేశారో కష్టాలు
వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉంది..? ఈ తప్పులు చేశారో కష్టాలు
ఆ సినిమా ఆసక్తి లేకుండానే చేశా.. కట్ చేస్తే.. ఇప్పటికీ ట్రెండింగ్
ఆ సినిమా ఆసక్తి లేకుండానే చేశా.. కట్ చేస్తే.. ఇప్పటికీ ట్రెండింగ్