AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papikondalu: ప్రకృతి ఒడిలో పరవశించండి.. పర్యాటకులకు అదిరిపోయే న్యూస్‌.. పాపికొండలు విహారయాత్ర ప్రారంభం..

పాపికొండలు నదీ విహారయాత్ర మళ్ళీ ప్రారంభమైంది. నాలుగు నెలల తర్వాత పర్యాటకులకు అనుమతి ఇవ్వడంతో గండిపోచమ్మ నుండి పేరంటాలపల్లి వరకు బోట్లు నడుస్తున్నాయి. 15 బోట్లకు అనుమతులు లభించాయి. భద్రతకు ప్రాధాన్యతనిస్తూ లైఫ్ జాకెట్లు, తనిఖీలు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రమాద నివారణకు మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. పర్యాటకులు సురక్షితంగా విహారయాత్ర చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Papikondalu: ప్రకృతి ఒడిలో పరవశించండి.. పర్యాటకులకు అదిరిపోయే న్యూస్‌.. పాపికొండలు విహారయాత్ర ప్రారంభం..
Papikondalu
Shaik Madar Saheb
|

Updated on: Oct 27, 2024 | 9:14 AM

Share

దీపావళి సెలవులకు ముందు పాపికొండల విహార యాత్ర మళ్లీ ప్రారంభమైంది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో పాపికొండలు విహారయాత్ర మొదలైంది. దాంతో.. గండిపోచమ్మ బోట్ పాయింట్ నుండి పాపికొండలు పర్యటనకు వెళ్లారు పలువురు టూరిస్టులు. నాలుగు నెలల తర్వాత మళ్ళీ పాపికొండలు విహారయాత్ర స్టార్ట్‌ కావడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులు కావేరి బోట్‌లో షికార్లు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సందడి మధ్య తొలిరోజు పాపికొండల విహారయాత్ర కొనసాగించారు టూరిస్టులు. పర్యాటకులు తరలిరావడంతో గండిపోచమ్మ పరివాహక ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. తొలి రోజు 41 మందితో కావేరి బోట్ పాపికొండలు విహారయాత్రకు వెళ్లింది.

లైఫ్ జాకెట్లతో పాటు ప్రత్యేక తనిఖీలు తర్వాత బోట్‌కు అనుమతిచ్చారు పర్యాటక శాఖ అధికారులు. నాలుగు నెలల తర్వాత పాపికొండల విహారయాత్ర ప్రారంభమవడంతో ఇకపై పర్యాటకుల తాకిడి పెరగనుంది. ఈ క్రమంలోనే.. పాపికొండలు పర్యటనకు 15 బోట్లకు ఫిట్నెస్, లైసెన్స్‌ ఇచ్చారు పర్యాటక శాఖ అధికారులు. గండిపోచమ్మ ఆలయం నుంచి పేరంటాలపల్లి వరకు విహారయాత్ర కొనసాగుతుంది.

వీడియో చూడండి..

ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు..

పాపికొండల టూర్‌కు అనుమతి ఇవ్వడంతో సబ్ కలెక్టర్ కల్పశ్రీతోపాటు స్థానిక అధికారులు బోట్లను పరిశీలించారు. బోట్ల ఫిట్‌నెస్‌, లైసెన్స్‌ రికార్డులను వెరిఫై చేసి.. బోటులో గోదావరిలో షికారు చేశారు సబ్ కలెక్టర్ కల్పశ్రీ. ఈ సందర్భంగా.. టూర్‌కు వెళ్ళే సమయంలో ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యలుపై ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. పాపికొండల టూర్‌కు వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బోట్ల యజమానులకు సూచించారు. ఒకవేళ పర్యాటకుల నుండి ఫిర్యాదులు వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సబ్ కలెక్టర్ కల్పశ్రీ. అటు.. ప్రభుత్వ అనుమతులతో ఇకపై.. పాపికొండల్లో బోట్లు కంటిన్యూగా అందుబాటులో ఉంటాయని.. పర్యాటక ప్రియులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు నిర్వాహకులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం