AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందమైన యువతులను రప్పించి.. ఆన్‌లైన్‌ కేంద్రంగా బిజినెస్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు..

మూడొస్తే మూడు నిమిషాల్లో మ్యాటర్ రెడీ.. ఒక్క మెసేజ్ చేస్తే చాలు క్షణాల్లో ఫిగర్‌ను సెట్ చేసేస్తారు.

అందమైన యువతులను రప్పించి.. ఆన్‌లైన్‌ కేంద్రంగా బిజినెస్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు..
uppula Raju
|

Updated on: Dec 05, 2020 | 5:25 PM

Share

మూడొస్తే మూడు నిమిషాల్లో మ్యాటర్ రెడీ.. ఒక్క మెసేజ్ చేస్తే చాలు క్షణాల్లో ఫిగర్‌ను సెట్ చేసేస్తారు. ఇదంతా ఆన్‌లైన్ సెక్స్‌ దందా. ఇంటర్‌నెట్‌ను బ్రోకర్లు ఫుల్‌గా వాడుసుకుంటున్నారు. మొబైల్‌లోనే యువతను బుక్ చేసేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఆన్‌లైన్ వ్యభిచార బిజినెస్ జోరుగా సాగుతోంది. విషయం సీఐడీ సైబర్ వింగ్‌కు తెలియడంతో ఇవాళ ఏపీ వ్యాప్తంగా ఏక కాలంలో రైడ్స్ నిర్వహించారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలలో సీఐడీ సైబర్ వింగ్, స్థానిక పోలీసులతో కలిసి దాడులు చేశారు.

విశాఖలో ఓ స్టార్ హోటల్‌పై రైడ్ చేసి వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. కోల్‌కతాకు చెందిన యువతిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సంతోశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో కీలక నిందితులు పవన్, క్రాంతిలు పరారీలో ఉన్నారు. ఆన్‌లైన్ సాయంతోనే కోల్‌కతా యువతిని విశాఖ రప్పించి విటులను ఆకర్షిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ బిజినెస్‌కు సంబంధించి సంతోశ్‌తో పాటు కోల్‌కతాలో కూడా ఇద్దరు, ముగ్గురు స్నేహితులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారితో పాటు విశాఖలో ఉన్న పవన్, క్రాంతిలు ఒక్కటై ఈ దందాను నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ సైబర్ వింగ్ ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి స్టాప్‌ ఐటీసీ పేరుతో ఏక కాలంలో నాలుగు ప్రధాన నగరాల్లో దాడి చేసి నిందితులను పట్టుకున్నారు.