NTR Statue: ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసేందుకు పట్టపగలే ఓ వ్యక్తి యత్నం.. దుండగుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్

NTR Statue: గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో మండలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వసం చేశారు. ఇది దారుణమని ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్టీఆర్ తనయుడు..

NTR Statue: ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసేందుకు పట్టపగలే ఓ వ్యక్తి యత్నం.. దుండగుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్
Ntr Statue Destroyed In Gun
Follow us

|

Updated on: Jan 03, 2022 | 12:27 PM

NTR Statue in Durgi: గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో మండలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వసం చేశారు. ఇది దారుణమని ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ చెప్పారు. అంతేకాదు తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడి పునర్జింప చేసిన మన అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు మహాపురుషిని ఈ సందర్భంగా కీర్తించారు. తెలుగు మహాపురుషుని విగ్రహం ధ్వంసం చేయటం అంటే మన తెలుగు జాతిని అవమానించినట్లేనని రామకృష్ణ చెప్పారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు. ఎన్.టి.ఆర్ విగ్రహంపై చేయి వేస్తే తెలుగు జాతి ఊరుకోదని చెప్పారు రామకృష్ణ.

కొందరు వైసీపీ నేతలం అంటూ విర్రవీగుతున్నారు.. మీరు నిద్రపోతున్నారేమో.. మేము ఎన్టీఆర్ అభిమానులం. ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకోమని.. మీరు కూడా తక్షణమే విగ్రహాన్ని ధ్వసం చేసిన దుండగులను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేయాలనీ డిమాండ్ చేశారు నందమూరి రామకృష్ణ

మరోవైపు గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా టీటీడీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ధర్నా చేస్తున్నారు. మాచర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈపూర్ స్టేషన్ కి తరలించారు.

Also Read:  ఆర్ఆర్ఆర్ వాయిదాతో సంక్రాంతి రేసులో చిన్న సినిమాలు.. బరిలో ఎన్ని సినిమాలో తెలుసా..