Balayya: బాలయ్య పాట పెట్టిన వైసీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే వేధింపులు.. 3వ కన్ను తెరుస్తానంటూ నటసింహం వార్నింగ్

3 రోజుల క్రితం వైసీపీ కార్యకర్త భాస్కర్‌రెడ్డి.. MLA గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. భాస్కర్‌రెడ్డి, బాలకృష్ణ సాంగ్‌ పెట్టడం వల్ల పార్టీ నేతల నుంచి వేధింపులు ఎదురయ్యాయనే ఆరోపణలు వచ్చాయి.

Balayya: బాలయ్య పాట పెట్టిన వైసీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే వేధింపులు.. 3వ కన్ను తెరుస్తానంటూ నటసింహం వార్నింగ్
Nandamuri Balakrishna
Follow us

|

Updated on: Mar 15, 2023 | 1:22 PM

నర్సరావుపేట MLA గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు.  పొలిటీషియన్ పొలిటీషియన్‌గానే ఉండాలని సూచించారు.  నీచానికి దిగజారకు అంటూ శ్రీనివాసరెడ్డిని ఘాటుగా హెచ్చరించారు.  3 రోజుల క్రితం ప్రభ ఊరేగింపు సందర్భంగా… బాలకృష్ణ పాట పెట్టాడు YCP కార్యకర్త భాస్కర్‌రెడ్డి. ఆపై అతడిని ఎమ్మెల్యే వేధించినట్లు ప్రచారం జరిగింది. అనంతరం భాస్కర్‌రెడ్డి.. MLA గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపైనే MLA శ్రీనివాసరెడ్డికి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు.

సినిమాలు వేరు రాజకీయాలు వేరు అన్నారు బాలయ్య.  అన్ని పార్టీల వాళ్లు తన సినిమాలు చూస్తారని పేర్కొన్నారు. సినీ నటులకు అన్ని వర్గాల్లో అభిమానులు ఉంటారని చెప్పుకొచ్చారు. తాను 3వ కన్ను తెరిస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని.. ఇంత నీచానికి దిగజారడం ఏంటని బాలయ్య ప్రశ్నించారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా పద్దతి మార్చుకోవాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సూచించారు బాలయ్య.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి