Municipal Workers: పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విన్నూత్నంగా నిరసన.. కంగుతిన్న అధికారులు

ఎక్కడైనా వీధుల్లో ఉన్న చెత్తనంతా తీసుకొని వెళ్లి యార్డ్‎లో పోయడం అనేది పారిశుద్ధ్య కార్మికుల విధి. కానీ రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు గడచిన పది రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. నగరంలో రోడ్లన్నీ చెత్తతో నిండిపోవడంతో అధికారులు ఎవరి చెత్తను వారి ఇళ్లల్లోనే పెట్టుకోవాలంటున్నారు. ఇంటి వద్దకే వచ్చి కొత్తగా నియమించి పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను తీసుకెళ్తారని తెలిపారు.

Municipal Workers: పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విన్నూత్నంగా నిరసన.. కంగుతిన్న అధికారులు
Municipal Sanitation Workers
Follow us

| Edited By: Srikar T

Updated on: Jan 04, 2024 | 9:57 PM

ఎక్కడైనా వీధుల్లో ఉన్న చెత్తనంతా తీసుకొని వెళ్లి యార్డ్‎లో పోయడం అనేది పారిశుద్ధ్య కార్మికుల విధి. కానీ రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు గడచిన పది రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. నగరంలో రోడ్లన్నీ చెత్తతో నిండిపోవడంతో అధికారులు ఎవరి చెత్తను వారి ఇళ్లల్లోనే పెట్టుకోవాలంటున్నారు. ఇంటి వద్దకే వచ్చి కొత్తగా నియమించి పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను తీసుకెళ్తారని తెలిపారు. అయితే గతంలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమణ తర్వాత పనుల్లోకి వస్తారు చెత్త తీసుకెళ్తారని సూచన చేస్తున్నారు.

గత 10 రోజులుగా నిరసన చేపడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అనంతపురం పట్టణంలో వినూత్నంగా తమ నిరసన తెలిపారు. వీధుల్లో ఉన్న చెత్తంతా ఓ ట్రాక్టర్లో ఎక్కించి అనంతపురం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పారబోశారు. దీంతో ఒక్కసారిగా అధికారులు షాక్ అయ్యారు. ఎందుకంటే గతంలో అనేక మున్సిపాలిటీల పరిధిలో ఎవరైనా చెత్త పన్ను కట్టకపోతే, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోతే చెత్త తీసుకొని వారి ఇళ్ళ ముందు, షాపులు ముందు పోసేవారు. అలాంటి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇవాళ తమ సమస్యల పరిష్కారం కోరుతూ తిరిగి అదే చెత్తను మున్సిపల్ ఆఫీసులో పోయడంతో అనంతపురం మున్సిపల్ అధికారులు కంగుతున్నారు.

చెత్త పై పన్ను వసూలు చేసిన అధికారులను ఇప్పుడు ఈ చెత్త ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకోవాలంటూ నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో అనంతపురం పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్ నిండా చెత్త తీసుకొని వచ్చి కార్యాలయ ఆవరణలో పోసి తమ నిరసన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్నారా? వర్షాకాలంలో ఈ టిప్స్ మీ కోసం..
ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్నారా? వర్షాకాలంలో ఈ టిప్స్ మీ కోసం..
వయ్యారాల పరువం.. చీరకట్టు అందాలలో మేనకలా తాప్సీ వయ్యారాలు.
వయ్యారాల పరువం.. చీరకట్టు అందాలలో మేనకలా తాప్సీ వయ్యారాలు.
చిన్నవేకదా అని చిన్న చూపు చూడకండి.. పురుషులకు తిరుగులేని వరం..
చిన్నవేకదా అని చిన్న చూపు చూడకండి.. పురుషులకు తిరుగులేని వరం..
పీతపై నరసింహస్వామి ఆకారం.. కోనసీమలో అద్భుతం.! వీడియో..
పీతపై నరసింహస్వామి ఆకారం.. కోనసీమలో అద్భుతం.! వీడియో..
పవన్ కల్యాణ్ 'తొలి ప్రేమ' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
పవన్ కల్యాణ్ 'తొలి ప్రేమ' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!