గుంటూరు లో విషాదం..ఆ కారణంతోనే బిడ్డలతో కలిసి తల్లి ఆత్మహత్య

|

Mar 21, 2023 | 9:32 AM

గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఘోర విషదం చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ తల్లీ, బిడ్డలు మృతి చెందడం కలకలం రేపుతోంది.

గుంటూరు లో విషాదం..ఆ కారణంతోనే బిడ్డలతో కలిసి తల్లి ఆత్మహత్య
Death
Follow us on

గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఘోర విషదం చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ తల్లీ, బిడ్డలు మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే నాగులుప్పల పాడు మండలం రాపర్లకు చెందిన పెరికల సామ్రాజ్యం(28) తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటుంది. అయితే కుటుంబ కలహాల కారణంగా ఆమె మసస్తాపం చెందింది. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. దీంతో ఈ నెల 13 న తన ముగ్గురు పిల్లలకు కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత తాను కూడా తాగింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అదే రోజున ఆమె కుమారుడు యోగేష్ (5) మృతి చెందాడు. మళ్లీ సోమవారం రాత్రి చికిత్స పొందుతూ తల్లి సామ్రాజ్యం, ఏడాది వయసున్న పాప వసుమతి మృతి చెందారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆమె మూడేళ్ల పాప షర్మిల చికిత్స పొందుతుంది. ఒకే కుటుంబంలో తల్లీ బిడ్డలు మరణించడంతో వాళ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..