AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

konaseema: బైక్‌ను ఢీకొట్టిన పాల వ్యాను.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్పాట్‌లోనే దుర్మరణం

శుక్రవారం ఉదయాన్నే ట్రాజెడీ న్యూస్ ఇది. ఏపీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఆ వివరాలు...

konaseema: బైక్‌ను ఢీకొట్టిన పాల వ్యాను.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్పాట్‌లోనే దుర్మరణం
Road Accident
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 17, 2022 | 4:09 PM

Share

Road Accident: శుక్రవారం ఉదయాన్నే ట్రాజెడీ న్యూస్ ఇది.  కోనసీమ జిల్లా కొత్తపేట(Kothapeta) మండలం మందపల్లి(Mandapalli) వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్పాట్‌లో చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే..  రావులపాలెం మండలం కొమర్రాజులంకకు చెందిన అప్పన నాగేశ్వరరావు అనే వ్యక్తి.. మరో మహిళతో కలిసి కొత్తపేటలోనే ఉంటున్నాడు. ఇంటికి రాకపోవడం.. కుటుంబ సభ్యులను పట్టించుకోకపోవడంతో… నాగేశ్వరరావు తల్లి అప్పన్న సత్యవతి(55), భార్య వెంకటలక్ష్మి(40), కొడుకు మహేష్(20)లు ముగ్గురు బైక్‌పై శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కొత్తపేట వెళ్లి నాగేశ్వరరావును నిలదీశారు. మాటా.. మాటా పెరిగి వారి మధ్య ఘర్షన జరిగింది.  అక్కడినుండి ముగ్గురు తిరిగి బైక్‌పై కొమర్రాజు లంక వస్తుండగా.. కొత్తపేట మండలం మందపల్లి వద్దకు వచ్చేసరికి రావులపాలెం వైపు నుండి కొత్తపేట వైపు వెళ్తున్న పాల వ్యాన్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలను కొత్తపేట గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..