AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరదా కోసం వెళ్లి శాశ్వతంగా దూరమయ్యాడు.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి

అమెరికాలో ఈ నెల 15న జరిగిన విమాన ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. అమెరికాలోని కాన్సాస్‌ రాష్ట్రంలో స్కై డైవింగ్‌ శిక్షణ విమానం కుప్పకూలి, అందులో ఉన్న కర్నూలు జిల్లా కౌతాళం మండలం రాజానగర్‌ క్యాంపునకు చెందిన దాట్ల సాయి కార్తీక్‌వర్మ (24) మృతి చెందాడు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది..

సరదా కోసం వెళ్లి శాశ్వతంగా దూరమయ్యాడు.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
Kurnool youth dies in US
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jun 17, 2026 | 7:18 AM

Share

కర్నూలు, జూన్‌ 17: అమెరికాలో జూన్‌ 15న జరిగిన విమాన ప్రమాదంలో కర్నూలు జిల్లా కోసిగి మండలం తుంబిగనూరు గ్రామానికి చెందిన దాట్ల సుబ్రహ్మణ్యం రాజు కుమారుడు సాయి కార్తీక్ వర్మ( 26) దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..

దాట్ల సుబ్రహ్మణ్యం రాజు, పద్మావతి దంపతుల సొంత గ్రామం కోస్తాంధ్రలోని భీమవరం. కాగా 30ఏళ్ల క్రితం కోసిగి మండలంలోని తుంబిగనూరు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఏకైక కుమారుడు సాయి కార్తీక్ వర్మ సంతానం. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళాడు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కాన్సాస్ రాష్ట్రంలో ఉంటున్నారు. ఈ నెల 15న ఆదివారం సరదాగా గడిపేందుకు స్కై డైవింగ్ సాహసక్రీడలో పాల్గొనేందుకు వెళ్లాడు.

ఇవి కూడా చదవండి

వీరిని తీసుకెళ్తున్న చిన్న విమానం సాంకేతిక లోకంతో కుప్పకూలడంతో మంటలు చెలరేగి 12 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. అందులో తమ ముద్దుల కొడుకు సాయి కార్తీక్ వర్మ కూడా ఉన్నట్లు చెప్పడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ చేదోడుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికంగా ఉన్న కొందరు నేతలు బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఓదారుస్తున్నారు.

Follow Us
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం
అభిమాని కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్..
అభిమాని కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్..
ఏకంగా మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా
ఏకంగా మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా
రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్
రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్
రంభ తృతీయ వ్రతం.. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఈ పూజ చేస్తే సౌభాగ్యం
రంభ తృతీయ వ్రతం.. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఈ పూజ చేస్తే సౌభాగ్యం
నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీతోనే 1979 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీతోనే 1979 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు
క్యారెట్ వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు..
క్యారెట్ వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు..
బంగారం, వెండి కొనే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ దిగొస్తున్న ధరలు
బంగారం, వెండి కొనే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ దిగొస్తున్న ధరలు