AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఈ విషయం తెలుసా… కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు షురూ

కర్నూల్‌ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి ఇండిగో విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అత్యధిక ఒత్తిడి ఈ విమాన సర్వీస్‌పైనే ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు .

Andhra: ఈ విషయం తెలుసా... కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు షురూ
Flight
Ram Naramaneni
|

Updated on: Jul 02, 2025 | 10:20 PM

Share

ఏపీలో విమాన సర్వీసులు ప్రయాణికులకు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూల్ టు విజయవాడ విమాన సర్వీసులను వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్ర విమానాయానశాఖమంత్రి రామ్మోహన్‌నాయుడు. ఇప్పటికే కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కర్నూల్‌ నుంచి విజయవాడకు కూడా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి ఇండిగో విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. ఓర్వకల్‌ ఎయిర్‌ పోర్టును మరింత విస్తరిస్తామన్నారు కేంద్రమంత్రి. ప్రతి ఎయిర్ పోర్ట్ లో అదనపు విమానాలు ప్రారంభించుకున్నామని తెలిపారు.

కర్నూలు ఎయిర్ పోర్ట్ అభివృద్హికి సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు రామ్మోహన్‌నాయుడు. కర్నూలు ఎయిర్ పోర్ట్ కి కనెక్టివిటీ పెంచుతామన్నారు. వారంలో 3 రోజులు విజయవాడ-కర్నూలు విమాన సర్వీసులు నడుస్తాయని, రాబోయే రోజుల్లో 7 రోజూలు నడిపిస్తామన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు. కర్నూలులో పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కర్నూలులో డ్రోన్ హబ్ రాబోతుందని తెలిపారు. అభివృద్ధిలో లాజిస్టిక్స్, కన్నెక్టీవిటీ ముఖ్యం అన్నారు కేంద్రమంత్రి. ఏపీలోని ప్రతి విమానాశ్రయం నుంచి అదనపు సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దేశంలోని అన్ని ముఖ్య నగరాలకు కనెక్టివిటీ ఉండేలా విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వారంలో మూడు రోజులు కర్నూలు నుంచి విజయవాడకు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లోనే ప్రతిరోజు విమాన సర్వీసులు ఉండేలా ప్రయత్నిస్తానని రామ్మోహన్‌నాయుడు తెలిపారు.