Watch Video: ఓ అమరవీరుడా సెల్యూట్.. మురళీనాయక్కు కన్నీటి వీడ్కోలు.. భారీగా హాజరైన జనం..
దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ మురళీనాయక్కు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది. అగ్నివీరుడిగా సైన్యంలోకి ఎంటరై, అమరవీరుడిగా అందరికీ స్ఫూర్తిని అందిస్తోన్న యువ కెరటానికి ఈ దేశం సలామ్ చేస్తోంది. పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు పూర్తి చేశారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ మురళీనాయక్కు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది. అగ్నివీరుడిగా సైన్యంలోకి ఎంటరై, అమరవీరుడిగా అందరికీ స్ఫూర్తిని అందిస్తోన్న యువ కెరటానికి ఈ దేశం సలామ్ చేస్తోంది. పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు పూర్తి చేశారు. మురళీ అంతిమయాత్రలో భారీగా పాల్గొన్నారు ప్రజలు. మురళీనాయక్ వ్యవసాయ క్షేత్రం వరకు దారి పొడవునా.. పూలు చల్లుతూ నివాళులు అర్పించారు. మురళి పార్థీవదేహం దగ్గర కడసారి తల్లిదండ్రులు చేసిన సెల్యూట్ అందరికీ కన్నీళ్లు తెప్పించింది. మురళీ నాయక్ అమర్ రహే అంటూ అంత్యక్రియల ప్రాంగణం హోరెత్తింది.
మురళీనాయక్ స్వగ్రామం కళ్లితండాలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, సవిత, అనగాని సత్య ప్రసాద్ కళ్లి తండాకు వెళ్లారు. మురళీనాయక్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమయాత్రలో మురళీనాయక్ పాడె మోశారు మంత్రి లోకేష్. జాతీయ జెండా చేత పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మురళీనాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఐదెకరాల పొలం, 300 గజాల ఇంటిస్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. మురళీనాయక్ తండ్రికి ఉద్యోగం ఇస్తామన్నారు పవన్, లోకేష్..
వీడియో చూడండి..
మురళీనాయక్కు అంతిమ వీడ్కోలు అంటూ.. సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. మురళి మన మధ్య లేకపోయినా.. అమరవీరుడి త్యాగం ఎప్పటికీ దేశ ప్రజల్లో స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటుందన్నారు. మురళి కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు..
వీర జవాన్ మురళీ నాయక్ కు అంతిమ వీడ్కోలు పలుకుతున్నాను. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుడు మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల… pic.twitter.com/gsijcZYJx5
— N Chandrababu Naidu (@ncbn) May 11, 2025
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..