IAS Sri lakshmi: ఐఎస్ఐ అధికారిణి శ్రీలక్షీకి ఏపీ సర్కార్ ప్రమోషన్.. కార్యదర్శి ర్యాంక్ నుంచి ఏకంగా..
IAS Sri lakshmi: ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ కార్యదర్శి శ్రీలక్షీకి ఏపీ సర్కార్ ప్రమోషన్ ఇచ్చింది. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్షీ ఇటీవలే తెలంగాణ నుంచి..
IAS Sri lakshmi: ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ కార్యదర్శి శ్రీలక్షీకి ఏపీ సర్కార్ ప్రమోషన్ ఇచ్చింది. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్షీ ఇటీవలే తెలంగాణ నుంచి డెప్యూటేషన్పై ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన విషయం తెలిసిందే. అలా బదిలీ అయిన శ్రీలక్ష్మీ తొలుత రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. కార్యదర్శి స్థాయి నుంచి ఆమెకు ముఖ్యకార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, శ్రీలక్ష్మీ మీద ఉన్న పెండింగ్ కేసుల తీర్పులు, డీవోపీటీ నిర్ణయం మేరకు ఈ పదోన్నతి అమలు అవుతుందని, తుది తీర్పునకు లోబడే ఉత్తర్వుల కొనసాగింపులు ఉంటుందని ఉత్తర్వుల్లో సీఎస్ స్పస్టం చేశారు.
Also read:
National Permit: ఇకపై ఆ వాహనాలకు అన్ని రాష్ట్రాల్లో ఒకే రుసుము.. ఈ విధానం అమల్లోకి వస్తే…
SI Suicide: గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య.. వివాహేతర సంబంధమే కారణమా..!