AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huge Robbery In Kadapa: జమ్మలమడుగులో భారీ చోరీ.. ఇంటి యజమానులు అలా వెళ్లగానే.. దొంగలు ఇలా దోచుకెళ్లాడు..

Huge Robbery In Kadapa: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కపడ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ఎర్రగుంట్లలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.

Huge Robbery In Kadapa: జమ్మలమడుగులో భారీ చోరీ.. ఇంటి యజమానులు అలా వెళ్లగానే.. దొంగలు ఇలా దోచుకెళ్లాడు..
Shiva Prajapati
|

Updated on: Jan 03, 2021 | 4:06 PM

Share

Huge Robbery In Kadapa: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కపడ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ఎర్రగుంట్లలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉన్నదంతా దోచుకెళ్లారు. వివరాల్లోకెళితే.. ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని క్రాంతినగర్‌లో శివశంకర్ రెడ్డి కుటుంబం నివాసముంటోంది. అయితే ఇతర పనుల నిమిత్తం శివశంకర్ రెడ్డి కుటుంబం బంధువుల ఊరికి వెళ్లింది. దీనిని పసిగిట్టిన దొంగలు.. ఇంటి యజమానులు అలా బయటకి వెళ్లగానే.. ఇలా ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న సుమారు రూ. 2 లక్షల నగదు సహా 10 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇదిలాఉంటే.. కడప రోడ్డులోని ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులోనూ దొంగలు పడ్డట్లు సమచారం. విషయం తెలుసుకున్న పోలీసులు.. దోపిడీకి గురైన రెండు చోట్లను పరిశీలించారు. వేలిముద్రలు, ఇతర క్లూస్‌ సేకరించారు. చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు లాభం, కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందన్న బండి సంజయ్‌

Practice Session : టీమిండియా ప్రాక్టీస్‌కు అడ్డొచ్చిన వరుణుడు.. జిమ్​లో చెమట చిందిస్తున్న ఆటగాళ్లు