ఘోర రోడ్డు ప్రమాదం.. అందరు చూస్తుండగానే కారులో డ్రైవర్ సజీవ దహనం..!
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించడంతో కారులో ఉన్న డ్రైవర్ బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. దీంతో అతడు కారులోనే సజీవ దహనమయ్యాడు.

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించడంతో కారులో ఉన్న డ్రైవర్ బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. దీంతో అతడు కారులోనే సజీవ దహనమయ్యాడు.
గుత్తి మండలం కొత్తకోట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోవడంతో డ్రైవర్ మృతదేహం గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంది. మృతుడు ఎవరు అనే విషయాన్ని పోలీసులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
అలాగే ప్రమాదం జరిగిన సమయంలో కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నాడా, లేక మరెవరైనా ప్రయాణిస్తున్నారా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేపట్టారు. కాలిపోయిన కారు అవశేషాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమా, లేక ఇతర సాంకేతిక లోపాలేమైనా ఉన్నాయా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
