Big Breaking: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఏ పీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది.

Big Breaking: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే
The AP High Court
Follow us

|

Updated on: Apr 06, 2021 | 4:50 PM

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌ఈసీ నొటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 15న ఎస్‌ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు కావాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని ఏపీ హైకోర్టు పేర్కొంది. ఈ నెల 1న ఎస్‌ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌లో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. నూతన ఎస్‌ఈసీ నీలం సాహ్నీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన వేసిన పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

ఎస్‌ఈసీ షెడ్యూల్ ఇలా ఉంది….

రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌‌ను ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 1 న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తామని నొటిఫికేషన్‌లో తెలిపారు. ఈ నెల 10న పరిషత్‌ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఈసీ నీలం సాహ్ని.. వరుస భేటీలతో తొలిరోజు బిజీబిజీగా గడిపారు. రెండో రోజు రాజకీయ పార్టీలతో మీటింగ్‌ పెట్టారు. ఆ తర్వాతే ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఉత్తర్వుుల జారీ చేశారు. తాజాగా కోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది.

Ap Zptc Mptc Election Notification 2021

మరోవైపు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయొద్దని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీలోని పలువురు నేతలు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ నేతలు అశోక్ గజపతి రాజు, జ్యోతుల నెహ్రూ తన అసంతృప్తిని ఇప్పటికే ప్రకటించారు.  కాగా బహిష్కరణ నిర్ణయానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కోరారు.  పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే అధినేత ఎన్నికలను బహిష్కరిస్తున్నారన్న విషయాన్ని గుమనించాలన్నారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక నిజాయితీగా జరిగితే తెలుగుదేశం విజయఢంకా మోగిస్తుందన్నారు.

Read more at: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-high-court-on-state-parishat-elections-290903.html?story=2

Also Read: “రైతుల వెన్నంటే కేసీఆర్”.. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న సీఎం అద్భుత చిత్రం వీడియో

26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే