AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Weather: ద్రోణి ప్రభావంతో ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక నుంచి దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆదివారం కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాల అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షంలో చెట్ల కింద నిలబడరని విపత్తుల నిర్వహణ అధికారులు సూచించారు.

Andhra Weather: ద్రోణి ప్రభావంతో ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు
Andhra Weather
Ram Naramaneni
|

Updated on: Sep 20, 2025 | 7:12 PM

Share

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.

ఆదివారం(21-09-25) : ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.  అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

శనివారం సాయంత్రం 6 గంటల నాటికి కాకినాడ జిల్లా రాయభూపాలపట్నం లో 74.2మిమీ, రౌతులపూడిలో 57.7మిమీ, నెల్లూరు జిల్లా ఉలవపాడులో 52మిమీ, కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో 49.7మిమీ, మలికిపురంలో 45.7మిమీ, బాపట్లలో 45.2మిమీ, విజయనగరం జిల్లా తెన్నుబొడ్డవరలో 44.5మిమీ, అమలాపురంలో 44మిమీ వర్షపాతం నమోదైందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.