AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే గంజాయి మాయం.. దర్యాప్తులో నిందితుడు ఎవరో తెలిసి పోలీసులు షాక్

అనకాపల్లి జిల్లా కోటపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రపరిచిన 200 కిలోల గంజాయి మాయమైంది. దీంతో సీరియస్ అయిన అధికారులు వెంటనే విచారణ ప్రారంభించారు.

Andhra Pradesh: ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే గంజాయి మాయం.. దర్యాప్తులో నిందితుడు ఎవరో తెలిసి పోలీసులు షాక్
Ganja
Ram Naramaneni
|

Updated on: Jan 07, 2023 | 5:37 PM

Share

బీటెక్‌ స్టూడెంట్స్‌… సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఈ మధ్య గంజాయి, డ్రగ్స్‌ కేసులో దొరికిపోతున్నారు. పట్టుబడువారంతా ఎక్కువగా 25 ఏళ్ల లోపు వారే. మంచిగా చదువుకున్నారు. సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లు అయ్యారు. కానీ విలాసాలకు అలవాటుపడి వస్తున్న తప్పుడు మార్గంలో ప్రయాణించి పోలీసులుకు దొరికిపోతున్నారు. ఈ మధ్య కాలంలో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు అయితే గంజాయికి బానిసలుగా మారి ఇళ్లలోనే మత్తు మొక్కలను పెంచుతున్నారు. దీంతో పోలీసులు.. మరింత అలెర్ట్ అయ్యారు. మత్తు అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి మాఫియా బెండు తీయడం సహా .పాత నేరస్తులపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడం.. మన్యం రైతులను అల్లం, పసుపు వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడంలో పోలీసులు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.

ఇదిలా ఉండగా.. అనకాపల్లి జిల్లాలో ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే గంజాయి మాయమవ్వడం సంచలనంగా మారింది. కె.కోటపాడు పోలీసుస్టేషను నుంచి గంజాయి చోరీకి గురైంది. దీనిపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు వెంటనే.. ఇన్‌సైడ్ ఎంక్వైరీ వేశారు. హెడ్‌ కానిస్టేబుల్‌ శ్యామ్‌కుమార్‌ ఇందులో కీలక పాత్రధారిగా గుర్తించారు. హెడ్‌ కానిస్టేబుల్‌‌తో పాటు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కె.కోటపాడు ఎస్‌ఐ ధనుంజయ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఇటీవల  పట్టుకున్న గంజాయిని పోలీసుస్టేషన్‌లో స్టోర్ చేశామని… ఇందులో 200 కేజీలు ఈ నెల 3న చోరీకి గురైందని తెలిపారు.  విచారణ చేయగా హెడ్‌ కానిస్టేబుల్‌ శ్యామ్‌కుమార్‌ సాయంతో ఏ.కోడూరుకు చెందిన శెట్టి సందీప్‌కుమార్‌ చోరీ చేసినట్లు తేలిందన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్యామ్‌కుమార్‌, శెట్టి సంజీవ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులు మరో ముగ్గురు మైనర్లు సహకారం తీసుకున్నారని, గంజాయిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Ganja

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..