కుక్కల ఇంజెక్షన్తో హత్య.. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న నిందితుడు!
నెల్లూరు జిల్లాలో దారుణంగా చోటు చేసుకుంది. బావకు కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న హరికృష్ణ కుటుంబంతో సహా సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలుకు కింద పడి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో నిందితుడు హరికృష్ణ, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం వ్యవసాయ శాఖ అధికారి శ్రీహరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరికృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర రైలు కింద పడి నలుగురు సూసైడ్ చేసుకున్నారు. మృతుల్లో నిందితుడు హరికృష్ణ, అతని భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నెల 15న ఏవో శ్రీహరిని కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడనే ఆరోపణలు హరికృష్ణపై ఉన్నాయి. అతనిపై శ్రీహరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దైవదర్శనానికి అని తీసుకెళ్లి వచ్చే దారిలో కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసి, గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులను నమ్మించాడు.
పైగా వారి సంప్రదాయం ప్రకారం ఖననం చేయాల్సిన మృతదేహాన్ని దహనం చేయించాడు. ఆ తర్వాత శ్రీహరికి చెందిన ఆస్తి తనకు ఇవ్వాలని, శ్రీహరి భార్య లావణ్యపై ఒత్తిడి తేవడంతో ఆమె ఈ నెల 6న నెల్లూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు.. కుక్కలను చంపేందుకు ఇచ్చే ఇంజెక్షన్తో తన శ్రీహరిని, బావమరిది హరికృష్ణ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అప్పటి హరికృష్ణ పరారీలో ఉన్నాడు. అయితే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని గతంలోనే వీడియో విడుదల చేసిన హరికృష్ణ, ఇప్పుడు ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకున్నాడు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
