AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రహదారి రక్తసిక్తం.. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. అక్కడికక్కడే నలుగురు మృతి.. పలువురికి గాయాలు..

Kadapa: ఆర్టీసీ బస్సు పులివెందుల నుంచి శ్రీశైలం వెళుతుందని ఆటో ప్రొద్దుటూరు నుంచి మల్లెలకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఎర్రగుంట్ల సమీపానికి రాగానే కళ్యాణ మండపం దగ్గర అతివేగంగా వస్తున్న ఆటో ఆర్టీసీ బస్సు రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటో నుజ్జునుజు అయింది. అందులో ప్రయాణిస్తున్న పదిమందిలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా ఆరుగురికి తీవ్రమైన గాయాలు..

Andhra Pradesh:  రహదారి రక్తసిక్తం.. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. అక్కడికక్కడే నలుగురు మృతి.. పలువురికి గాయాలు..
Kadapa Road Accident
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Oct 09, 2023 | 12:16 PM

Share

కడప జిల్లా, అక్టోబర్10; అతివేగం ప్రమాదానికి కారణం. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఆటో అతివేగంగా వచ్చిందో ఆర్టీసీ బస్సు వేగంగా వస్తుందో తెలియదు గానీ ఈ రెండు ఢీకొని నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి బస్సులో ప్రయాణికులకు ఏమీ కాకపోయినా ఆటోలో ప్రయాణిస్తున్న పదిమందిలో నలుగురు అక్కడికక్కడే చనిపోవడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పొద్దుటూరు నుంచి మల్లెల వెళుతున్న ఆటో ఆర్టీసీ బస్సును ఢీకొని నుజ్జు నుజ్జు అయింది క్షతగాత్రులను పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఎర్రగుంట్ల మండలం ఎర్రగుంట్ల బైపాస్ దగ్గర ఉండే ఎస్వీ కళ్యాణ మండపం దగ్గర ఆటో బస్ ఢీకొని ఆటో లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికడ్డే మరణించారు. ఇందులో ఇద్దరు మగవారు కాగా ఇద్దరు ఆడవారు ఉన్నారు. బస్ లో వారికి ఏమీ కాలేదు. ప్రొద్దుటూరు నుండి మల్లెల కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆటో లో 10 మంది ప్రయాణిస్తుండగా 6 గురికి తీవ్ర గాయాలు అయ్యాయి, 4 గురు అక్కడికక్కడే చనిపోయారు.. వీరంతా కడప నగరం ఆజాద్ నగర్ కాలనీకి చెందిన వారని కడప నుంచి ప్రొద్దుటూరు వెళ్లి అక్కడ నుంచి ఆటోలో మల్లేల పోతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన వారు మహమ్మద్ (25 ), షాకీర్ (10), హసీన (25), అమీన (20)గా గుర్తించారు. మిగిలిన ఆరుగురు గాయపడ్డ వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆర్టీసీ బస్సు పులివెందుల నుంచి శ్రీశైలం వెళుతుందని ఆటో ప్రొద్దుటూరు నుంచి మల్లెలకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఎర్రగుంట్ల సమీపానికి రాగానే కళ్యాణ మండపం దగ్గర అతివేగంగా వస్తున్న ఆటో ఆర్టీసీ బస్సు రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటో నుజ్జునుజు అయింది. అందులో ప్రయాణిస్తున్న పదిమందిలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా ఆరుగురికి తీవ్రమైన గాయాలు కావడంతో వారందరినీ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అయితే కడపకు చెందిన వీరంతా మల్లెలకు బంధువుల కార్యక్రమమునకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని గాయపడిన వారిలో ఒకరు తెలిపారు ఏదేమైనా అతివేగం కడప జిల్లాలో నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..
ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. నెలనెలా రూ.6,500
ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. నెలనెలా రూ.6,500