AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో వారికి సూపర్ ఛాన్స్.. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు.. దరఖాస్తు ఇలా చేస్కోండి

ఏపీలోని మత్స్యకారుల కోసం ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం. ఈ పథకం కింద లబ్దిదారులకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించుంది. మత్స్యకారులు మరణిస్తే కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించనుంది.

Andhra Pradesh: ఏపీలో వారికి సూపర్ ఛాన్స్.. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు.. దరఖాస్తు ఇలా చేస్కోండి
Money 5
Venkatrao Lella
|

Updated on: Jan 19, 2026 | 12:57 PM

Share

ఏపీలో మత్స్యకారుల కుటుంబాలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. మత్స్యకారుల  కుటుంబాలకు అందించే బీమా సొమ్మును భారీగా పెంచింది. ఇప్పటివరకు మత్స్యకారులకు రూ.2 లక్షల బీమా అందిస్తుండగా.. ఇప్పుడు దీనికి ఏకంగా రూ.10 లక్షలకు పెంచింది. దీంతో మత్స్యకారులు ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబానికి రూ.10 లక్షల ఆర్దిక సాయం అందనుంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళతారు. కేవలం చేపల వేటపైనే ఆధారపడి వీళ్లు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. సముద్రంలో ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తూ ఉంటారు. దీంతో వీరికి రక్షణ కల్పించేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా మత్స్యకారులు అండగా నిలవనుంది.

సముద్రంలో చేపల వేట అనేది ప్రమాదంతో కూడుకున్న విషయం. చేపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తూ మరణిస్తూ కుటుంబానికి దిక్కు లేకుండా పోతోంది. దీంతో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ఇక నుంచి సహాజ మరణం లేదా ఇతర ప్రమాదాల వల్ల మత్స్యకారులు మరణించినా కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందిస్తారు. కార్మికశాఖ నుంచి వీటిని లబ్దిదారులకు అందిస్తారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఈ పథకం ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

అర్హతలు ఇవే..

-ఏదైనా మత్స్యకార సహకార సంఘంలో సభ్యుడై ఉండాలి -చేపల వేట లైసెన్స్ తీసుకుని ఉండాలి -మత్స్యశాఖ వద్ద పేరు నమోదు చేసుకోవాలి -చేపల బోట్లల్లో పనిచేసేవారు కూడా అర్హులే -ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మత్స్యకార సహకార సంఘం ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి.

బీమా సొమ్ము ఎలా పొందాలంటే..?

ఈ పథకంలో చేరిన వ్యక్తి మరణించినప్పుడు సమీపంలోని జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో లేదా రైతు సేవా కేంద్రంలో కుటుంబసభ్యులు దరఖాస్తులు సమర్పించాలి. మరణించిన వ్యక్తి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, డెత్ సర్టిఫికేట్, పంచనామా పత్రం వంటి డాక్యుమెంట్స్ సమర్పించాలి. దీంతో అధికారులు నిర్ధారించి బీమా సొమ్మును కుటుంబానికి అందిస్తారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున సహాయం అందిస్తోంది. చేపల వేటకు ఉపయోగించే బోట్లు, వలలు, ఇంజిన్లు లాంటి వస్తువలను రాయితీపై అందిస్తోంది. మత్స్యకారులందరికీ ఈ పథకం మంచి అవకాశమని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఏమైనా అనుమానాలు ఉంటే మత్స్యశాఖ కార్యాలయాన్ని సందర్శించాలని సూచిస్తున్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.10 లక్షలు.. దరఖాస్తులకు అవకాశం
ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.10 లక్షలు.. దరఖాస్తులకు అవకాశం
మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..