AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు

ఆంధ్రప్రదేశ్‌లోని మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదం ఒంగోలు పేర్నమిట్టలోని మినోఫాం ఫార్మా కంపెనీలో జరిగింది. పరిశ్రమలో శానిటైజర్లు తయారు చేస్తుండగా..

బ్రేకింగ్: మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 15, 2020 | 1:40 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదం ఒంగోలు పేర్నమిట్టలోని మినోఫాం ఫార్మా కంపెనీలో జరిగింది. పరిశ్రమలో శానిటైజర్లు తయారు చేస్తుండగా ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. శానిటైజర్‌లలో ఉపయోగించే ఆల్కహాల్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా పరిశ్రమలోని రెండు ఫోర్లకు దట్టమైన పొగలు వ్యాప్తించడంతో.. అక్కడి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేస్తున్నారు. కాగా ఇప్పటికే విశాఖ గ్యాస్ లీక్ ఘటనతో ప్రజలు భయాందోళన చెందుతుంటే.. ఇప్పుడు ఈ ప్రమాదంతో ప్రజలు మరింత భయానికి గురవుతున్నారు.

Read More:

రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపా? సడలింపా?