AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: కొన్న ఒక్కరోజులోనే ప్రాణం తీసింది.. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి వ్యక్తి మృతి.. మరో ముగ్గురు

E-bike battery explosion: ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ (Vijayawada) సూర్యారావుపేటలో దారుణం చోటుచేసుకుంది. విజయవాడ గులాబీపేటలో ఎలక్ట్రికల్‌ బైక్‌ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందారు.

Vijayawada: కొన్న ఒక్కరోజులోనే ప్రాణం తీసింది.. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి వ్యక్తి మృతి.. మరో ముగ్గురు
representation image
Shaik Madar Saheb
|

Updated on: Apr 23, 2022 | 11:45 AM

Share

E-bike battery explosion: ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ (Vijayawada) సూర్యారావుపేటలో దారుణం చోటుచేసుకుంది. విజయవాడ గులాబీపేటలో ఎలక్ట్రికల్‌ బైక్‌ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో మృతుడి భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన (electric scooter battery blast) శనివారం ఉదయం చోటుచేసుకుంది. గులాబీపేటకు చెందిన శివకుమార్‌ నిన్ననే కొత్త CORBETT14 ఎలక్ట్రిక్ బైక్‌ కొనుగోలు చేశాడు. అనంతరం ఇంట్లోని బెడ్‌రూమ్‌లో బైక్‌ బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో శివకుమార్‌తోపాటు భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. వారి అరుపులతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. తలుపులు పగలగొట్టి ఆ ఇంట్లోకి వెళ్లారు. అనంతరం తీవ్రగాయాలైన వారిని 108 ద్వారా ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మద్యలో శివకుమార్‌ మృతి చెందాడు. ప్రస్తుతం శివకుమార్ భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులకు చికిత్స అందుతోంది. మెరుగైన చికిత్స కోసం వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Also Read:

AP Weather: ఏపీ వాసులకు అలెర్ట్.. 4 రోజులు పలు ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Andhra Pradesh: ఇలాంటి రేస్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..!