Srikakulam: చంద్రబాబు బస చేసిన చోట ఆసక్తికర ఘటన.. అతన్ని చూసి బయటికి వచ్చేసిన మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. నామినేషన్ల పర్వం మొదలు కానుండటంతో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు బస చేసిన పలాస టీడీపీ కార్యాలయం వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అనుకోని సొంత పార్టీ ప్రత్యర్థులు ఎదురెదురయ్యాయి. అధినేత సమక్షంలో ముఖం చాటేశారు.

Srikakulam: చంద్రబాబు బస చేసిన చోట ఆసక్తికర ఘటన.. అతన్ని చూసి బయటికి వచ్చేసిన మాజీ మంత్రి
Tdp Leaders
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 16, 2024 | 6:34 PM

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. నామినేషన్ల పర్వం మొదలు కానుండటంతో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు బస చేసిన పలాస టీడీపీ కార్యాలయం వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అనుకోని సొంత పార్టీ ప్రత్యర్థులు ఎదురెదురయ్యాయి. అధినేత సమక్షంలో ముఖం చాటేశారు.

పలాసలో టీడీపీ కార్యాలయం వద్ద కింజరాపు అచ్చెన్నాయుడుకి, గుండ లక్ష్మి దేవి కుటుంబానికి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. చంద్రబాబు బస చేసిన పార్టీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ దంపతులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో ఎడ ముఖం,పెడ ముఖంగా వ్యవహరించిన తీరు అక్కడున్న పార్టీ నాయకుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. చంద్రబాబును కలిసేందుకు వచ్చిన గుండ దంపతులు అక్కడే ఉన్న హాల్‌లో నిరీక్షించేందుకు వెళ్ళారు. అప్పటికే ఆ హాల్‌లో ఎదురుగా అచ్చెన్నాయుడు కూర్చుని కనిపించాడు. అచ్చెన్నాయుడును ఒక్కసారిగా హాల్‌లో చూసి మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చేశారు.

అనంతరం మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర్ శివాజీ బయటికి వచ్చి అప్పల సూర్యనారాయణను రిసీవ్ చేసుకుని పక్కనే ఉన్న వేరొక రూంలోకి తీసుకువెళ్లారు. అప్పల సూర్యనారాయణ భార్య, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ దేవి అదే హాల్లో ఉన్నా అచ్చిన్నాయుడుకు దూరంగా కూర్చున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎదురుగానే ఉన్న ఆయన్ను ఏమాత్రం పలకరించలేదట. కింజరాపు కుటుంబం ముందు నుంచి తమను అణచి వేస్తుందంటూ గతంలోనే మీడియా ముందు బహిరంగంగానే అచ్చెన్నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు గుండ లక్ష్మి దేవి దంపతులు. లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వకుండా గొండు శంకర్‌కు అచ్చెన్నాయుడు టికెట్ కేటాయించారంటూ గుండ వర్గం ఆరోపించింది. తాజాగా పార్టీ అధినేతను కలిసేందుకు వచ్చి ఆయన సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు వ్యవహరించిన తీరు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ