AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఈ నెల 25న ఖాతాల్లోకి నగదు జమ

ఇప్పటికే మార్చి 14 నుంచి 17 వరకు గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ సమాఖ్య సహాయకులు (వీవోఏ), పట్టణ రిసోర్స్‌ పర్సన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 3వ విడత ఆసరాలో భాగంగా వారికి ఎంత మొత్తం గవర్నమెంట్ నుంచి లబ్ధి చేకూరుతుందో తెలియజేశారు.

CM Jagan: ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఈ నెల 25న ఖాతాల్లోకి నగదు జమ
AP CM YS Jagan
Ram Naramaneni
|

Updated on: Mar 23, 2023 | 4:24 PM

Share

పొదుపు సంఘాల మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆసరా స్కీమ్ కింద ఈ నెల 25న  78.94 లక్షల మంది అర్హులైన మహిళల అకౌంట్లలో రూ.6,419.89 కోట్ల నగదు ముఖ్యమంత్రి జమ చేయనున్నారు. ఏలారు జిల్లా  దెందులూరులో ఈ కార్యక్రమం జరగనుంది. 2019 సార్వత్రిక ఎలక్షన్స్ నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పును గవర్నమెంటే చెల్లింపులు చేస్తుంది. ఇందుకు సంబంధించిన డబ్బును 4 విడతల్లో చెల్లించే విధంగా అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. కాగా గత ఎలక్షన్స్ నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది.

ఇందులో ఇప్పటికే 2 దఫాల్లో రూ.12,758.28 కోట్లను మహిళల అకౌంట్లలో సర్కార్ జమ చేసింది. 3వ దఫా ఇప్పుడు అందజేసే రూ.6,419.89 కోట్లతో కలిపి మొత్తం రూ.19,178.17 కోట్లను గవర్నమెంట్ పొదుపు సంఘాల మహిళల అకౌంట్లో జమ చేసినట్టు అవుతుంది. ఈ నగదును ఎలాంటి ఆంక్షలు ఉండవ్. పొదుపు మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చని జగన్ సర్కార్ గతంలోనే వెల్లడించింది.

ఇక పోతే 3వ విడత ఆసరా పంపిణీ సందర్భంగా 10 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెల్లాయి.  స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలతోపాటు సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధుల ఈ ఉత్సవాల్లో భాగం అవుతారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం