AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM YS Jagan: ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇస్తున్న భృతిపై ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగ లేఖ

AP CM YS Jagan:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇస్తున్న భృతిపై వారికి బహిరంగ లేఖను రాశారు. తాము ఇస్తున్నది జీతం కాదు.. గౌరవ భృతి అని అన్నారు...

AP CM YS Jagan: ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇస్తున్న భృతిపై ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగ లేఖ
Subhash Goud
|

Updated on: Feb 09, 2021 | 11:06 PM

Share

AP CM YS Jagan:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇస్తున్న భృతిపై వారికి బహిరంగ లేఖను రాశారు. తాము ఇస్తున్నది జీతం కాదు.. గౌరవ భృతి అని అన్నారు. వేతనాలు పెంచాలంటూ ఇటీవల వాలంటీర్లు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వారికి ఈ లేఖను రాశారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకే గౌరవ భృతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. లంచాలు, వివక్ష లేని వ్యవస్థ కోసమే వాలంటీర్ల నియామకం చేపట్టినట్లు చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా వాలంటీర్లను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జీతాలు పెంచాలంటూ కొంత మంది గ్రామ, వార్డు వాలంటీర్లు డిమాండ్‌ చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. వాస్తవాలతో నిమిత్తం లేకుండా వారు రోడ్డు ఎక్కడం ఎంతో బాధించిందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే పౌర సేవలను ప్రజల ఇంటివద్దకే అందించేలా ఈ వ్యవస్థను తీసుకువచ్చినట్లు జగన్‌ తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందించాలన్న సదుద్దేశంతోనే వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Also Read: ఏలూరులో వింత వ్యాధిపై మరో హైలెవల్‌ కమిటీ ఏర్పాటు.. వివిధ శాఖలు సిద్ధం చేసిన యాక్షన్‌ ప్లాన్‌ పరిశీలన