Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం.. పిట్టగోడను ఢీ కొట్టిన బస్సు..

తిరుమ‌ల పుణ్యక్షేత్రం రెండో ఘాట్ రోడ్డులో మ‌రో ప్రమాదం తృటిలో త‌ప్పింది. కొండపైకి వెళ్తున్న బస్సు.. అదుపుతప్పి పిట్టగోడను ఢీ కొట్టింది. కొండ‌ను ఢీ కొట్టి, ఒరుసుకుంటూ వెళ్లింది. లింకు రోడ్డుకు సమీపంలో ఈ..

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం.. పిట్టగోడను ఢీ కొట్టిన బస్సు..
Tirumala Bus Accident
Follow us

|

Updated on: Feb 19, 2023 | 11:34 AM

తిరుమ‌ల పుణ్యక్షేత్రం రెండో ఘాట్ రోడ్డులో మ‌రో ప్రమాదం తృటిలో త‌ప్పింది. కొండపైకి వెళ్తున్న బస్సు.. అదుపుతప్పి పిట్టగోడను ఢీ కొట్టింది. కొండ‌ను ఢీ కొట్టి, ఒరుసుకుంటూ వెళ్లింది. లింకు రోడ్డుకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను వేరే బస్సు ద్వారా తిరుమలకు తరలించారు. ఈ ప్ర‌మాదంలో భక్తుల‌కు ప్రాణాపాయం త‌ప్పింది. కొంద‌రికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందించారు. క్రేన్ల‌ను తీసుకొచ్చి, బ‌స్సును వెలికి తీశారు ఆర్టీసీ ఉద్యోగులు. కాగా.. కొద్దిరోజుల కింద‌టే ఆర్టీసీ బ‌స్సు ఒక‌టి ఇదే ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. అదుపు త‌ప్పి, లోయలోకి జారిప‌డ‌బోయింది. లోయ అంచుల్లో ఉన్న చెట్లకు చిక్కుకుని నిలిచిపోయింది.

శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 14 నిండిపోయాయి. సర్వదర్శనానికి 19 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారిని 65,633 మంది భక్తులు దర్శించుకోగా 23,352 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

ఇవి కూడా చదవండి
Bus Accident In Tirumala

Bus Accident In Tirumala

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..