నర్సింగ్ విద్యార్ధిని అదృశ్యం.. కేసు నమోదు..

తూర్పు గోదావరి జిల్లాలో నర్సింగ్ విద్యార్ధిని అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది ప్రకాష్ పురంకు చెందిన జంపన్న గ్లోరి అనే యువతి అదృశ్యం అయ్యింది.

నర్సింగ్ విద్యార్ధిని అదృశ్యం.. కేసు నమోదు..
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2020 | 9:59 AM

తూర్పు గోదావరి జిల్లాలో నర్సింగ్ విద్యార్ధిని అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది ప్రకాష్ పురంకు చెందిన జంపన్న గ్లోరి అనే యువతి అదృశ్యం అయ్యింది. సదరు యువతి అమలాపురంలోని కిమ్స్‌ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే ఈమె తల్లిదండ్రులు ఉపాదినిమిత్తం గల్ఫ్‌ దేశంలో ఉంటున్నారు. యువతి అదృశ్యం అయిన విషయాన్ని బంధువులు తెలుసుకున్నారు. దీంతో వారు సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌లో.. యువతి అదృశ్యమైన విషయంపై ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

Latest Articles