జగన్ సర్కార్ డెసిషన్.. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి అని ప్రకటించింది. ఈ మేరకు..

జగన్ సర్కార్ డెసిషన్.. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ..
Biometric
Follow us

|

Updated on: Aug 24, 2021 | 7:43 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపట్నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి అని ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కీలక ఉత్తర్వులకు జారీ చేశారు. కరోనా కారణంగా గతేడాది మే నెల నుంచి బయోమెట్రిక్ హాజరుకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 13వ తేదీన అన్ని శాఖల కార్యదర్శులతో సీఎస్ ఆదిత్యనాధ్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో బయోమెట్రిక్ హాజరును పునరుద్దరించాలనే అంశంపై కీలకంగా చర్చించారు. ప్రభుత్వ కార్యాల‌యాల్లో ఉద్యోగులు హ‌జ‌రుపైనా చ‌ర్చ జ‌రిగింది.

చాలా మంది కార్యాల‌యాల‌కు టైంకు రాక‌పోవ‌డం.. వ‌చ్చినా బ‌య‌ట‌కు వెళ్ల‌డం.. స‌మ‌యం పూర్తి కాక‌పోయినా ముందుగానే ఆఫీసుల నుండి వెళ్లిపోవ‌డం వంటి విషయాలను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో బ‌యోమెట్రిక్ హ‌జ‌రును పున‌రుద్దించాల‌ని సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆదేశించారు. ఈ క్రమంలోనే సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సిద్ధం చేయాలని ఐటీ శాఖకు తెలిపారు.

ఇకపై హెచ్ఓడి కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, స్యయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర విభాగాలు, సచివాలయాల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని మెమోలో పేర్కోన్నారు. బయోమెట్రిక్ హాజరు నమోదుకు నెలవారీగా నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని.. ప్రతీశాఖ కార్యదర్శి ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ద్వారా పరిశీలించాలని సూచించారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు, జిల్లా కలెక్టర్‌లకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలను జారీ చేశారు.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..