AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్ను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో…సుబ్బారెడ్డి

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. తనపై హత్యాయత్నానికి పాల్పడిన భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

నన్ను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో...సుబ్బారెడ్డి
Sanjay Kasula
| Edited By: |

Updated on: Oct 18, 2020 | 7:55 PM

Share

తనను చంపాల్సిన అవసరం అఖిలప్రియ దంపతులకు ఏమొచ్చిందో అని టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. హత్య చేసేందుకు సుపారీ ఇచ్చారని తెలిసి షాక్ అయ్యానని అన్నారు. నాపై దాడి జరిగిన తర్వాత రెండున్నర నెలల మోనంగా ఉన్నాను. నాకు అఖిలప్రియ రాజకీయాలు నేర్పుతుందా…? అఖిలప్రియ ఓ ముద్దాయి అవునా? కాదా? అన్నదే తన ప్రశ్న అని అన్నారు. అఖిలప్రియపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని.. నా ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా నన్ను ఆళ్లగడ్డ రమ్మంటోందని.. నన్ను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో వారే చెప్పాలని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. తనపై హత్యాయత్నానికి పాల్పడిన భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న అఖిల ప్రియ దంపతులు కోర్టుకు హాజరుకాలేదన్నారు. కేసు విచారణను త్వరగా పూర్తి చేసిన పోలీసులు.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. కన్న కూతురులా చూసుకున్న తననే చంపాలని చూసిన అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబును ఏవీ సుబ్బారెడ్డి కోరారు.