AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలపై కీలక అప్‌డేట్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. సెప్టెంబర్ 11న ఫొటో సహిత ఓటర్ల జాబితాలను ప్రదర్శించనుండగా, సెప్టెంబర్ 15న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రచురించనున్నారు. సెప్టెంబర్ 19న పోలింగ్ కేంద్రాల తుది జాబితా వెలువడనుంది.

Andhra:  ఏపీలో MPTC, ZPTC ఎన్నికలపై కీలక అప్‌డేట్..
Andhra Pradesh Local Body Elections
M Sivakumar
| Edited By: |

Updated on: Sep 10, 2026 | 6:26 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్ కేంద్రాల ఎంపికపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఫొటోలతో కూడిన పూర్తి స్థాయి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాల్లో తప్పులు, పునరావృత నమోదులు, ఇతర అభ్యంతరాలు లేకుండా జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 11న ఫొటో సహిత ఓటర్ల జాబితాలను ప్రదర్శించనున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 14న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను సిద్ధం చేసి.. సెప్టెంబర్ 15న అధికారికంగా ప్రచురించనున్నారు.

పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే తెలియజేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అభ్యంతరాలు, మార్పులు, చేర్పులపై వినతులను స్వీకరించనున్నారు. ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేపట్టనున్నారు.

ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీల భాగస్వామ్యానికి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాధాన్యం ఇస్తోంది. సెప్టెంబర్ 16న రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు, ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి పార్టీల అభిప్రాయాలు, సూచనలను అధికారులు తెలుసుకోనున్నారు.

ఆ తర్వాత పోలింగ్ కేంద్రాల తుది జాబితా ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. సెప్టెంబర్ 18న పోలింగ్ కేంద్రాల జాబితాకు జిల్లా కలెక్టర్ల ఆమోదం తీసుకోనున్నారు. అనంతరం సెప్టెంబర్ 19న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించనున్నారు.

దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో మరో కీలక దశ పూర్తికానుంది. ఓటర్ల జాబితాల పరిశీలన నుంచి పోలింగ్ కేంద్రాల తుది ఖరారు వరకు ప్రతి అంశాన్ని నిబంధనల ప్రకారం పూర్తి చేసి, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. తాజా షెడ్యూల్‌తో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.

Follow Us