Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: బిగ్ అలెర్ట్.. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే.? ఈసారి వాట్సాప్‌కే

ఏపీ ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్ వచ్చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల ఎప్పుడో.? ఓ తేదీ వచ్చింది. ఆ తేదీలోగా ఫలితాలు విడుదల చేయాలనీ విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. మరి ఆ వార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

AP News: బిగ్ అలెర్ట్.. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే.? ఈసారి వాట్సాప్‌కే
Students
Follow us
Eswar Chennupalli

| Edited By: Ravi Kiran

Updated on: Apr 01, 2025 | 9:22 AM

ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12 నుంచి 15 మధ్య విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. పరీక్ష ఫలితాల ప్రక్రియను వేగవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కంప్యూటరీకరణ (డేటా ప్రాసెసింగ్) జరగాల్సి ఉంటుంది, దీని కోసం సుమారు ఐదు లేదా ఆరు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి ఫలితాలను కొత్త విధానంలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆన్లైన్ విధానంలో ఫలితాలను ప్రకటించడం సాధారణంగా జరుగుతోంది. అయితే, ఈసారి మరింత సులభతరం చేసేందుకు వాట్సాప్ ద్వారా ఫలితాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇందుకోసం ప్రతి విద్యార్థి మార్కులను పీడీఎఫ్ (PDF) రూపంలో తయారు చేసి, వాట్సాప్ ద్వారా పంపనున్నారు. ఈ పీడీఎఫ్ డాక్యుమెంట్లు షార్ట్ మెమోలుగా ఉపయోగపడతాయి. గతంలో ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన తర్వాత షార్ట్ మెమోలను వేరుగా విడుదల చేసేవారు. కానీ, ఈసారి ఫలితాల ప్రకటనే వాట్సాప్ ద్వారా జరుగుతుండటంతో, విద్యార్థులకు తక్షణ ఫలితాలు అందే విధంగా ప్రతిదీ పీడీఎఫ్ రూపంలో అందించనున్నారు. ఈ కొత్త విధానం విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరింత సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఫలితాలు అందించడంతో విద్యార్థులు తక్షణమే తమ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది.