AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీలం సాహ్నికి ఆదిలోనే హంసపాదు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అడ్డుకాలు పడింది. గురువారం బాధ్యతలు చేపట్టిన ఎస్ఈసీ నీలం సాహ్ని మధ్యలో నిలిచిపోయిన ఎన్నికలను వీలైనంత త్వరగా జరపాలని భావించారు.

నీలం సాహ్నికి ఆదిలోనే హంసపాదు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
Ap High Court
Balaraju Goud
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 03, 2021 | 2:49 PM

Share

BJP to ap high court:  ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అడ్డుకాలు పడింది. గురువారం బాధ్యతలు చేపట్టిన ఎస్ఈసీ నీలం సాహ్ని మధ్యలో నిలిచిపోయిన ఎన్నికలను వీలైనంత త్వరగా జరపాలని భావించారు. ఇందులో భాగంగానే కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 8న ఎన్నికల పోలింగ్ నిర్వహించి ఈనెల10న ఫలితాలను ప్రకటించాలని నిర్ణియించింది.

ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సహానీ కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే అధికార వైసీపీ మినహా మరే పార్టీ కూడా ఇందుకు ఒప్పుకోవడం లేదు. ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ, జనసేన – బీజేపీ ఇలాంటి కీలక పార్టీలు సైతం గైర్హాజరయ్యాయి.

అయితే మరోపక్క జనసేన దాఖలు చేసిన పిటిషన్ ఒకటి హైకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీనిపై మూడో తారీఖున విచారణ జరగాల్సి ఉంది అయినా సరే కొత్త ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఎన్నికల కమిషనర్ జారీ చేసిన కొత్త నోటిఫికేషన్ సవాల్ చేస్తూ వీరు ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు. తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరగా ఆ మూడు పిటిషన్లను ఈరోజు హైకోర్టు విచారణకు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరిషత్ ఎన్నికలపై తమ అభిప్రాయాలను నేతలు తెలియజేశారు. ఎన్నికలను బహిష్కరించాలని మెజార్టీ నేతలు సూచించారు. అభ్యర్థులు కూడా పోటీ నుంచి వెనక్కి వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని.. ఎన్నికల బహిష్కరణపై క్యాడర్‌కు, అభ్యర్థులకు వివరించాలని నేతలు అభిప్రాయం పడ్డారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఈ సాయంత్రం కీలక ప్రకటన చేసే అవకాశముంది.

Read Also…  Nagarjuna Sagar Bypoll: పొలిటికల్ హీట్ పెంచుతున్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక.. కీలక వ్యాఖ్యలు చేసిన జానారెడ్డి..

ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
Money Astrology 2025: కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ధనయోగం
Money Astrology 2025: కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ధనయోగం
హైదరాబాద్‌ టూ శబరిమల.. 10 ప్రత్యేక రైళ్లు.. ఏయే తేదీల్లో అంటే..!
హైదరాబాద్‌ టూ శబరిమల.. 10 ప్రత్యేక రైళ్లు.. ఏయే తేదీల్లో అంటే..!
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు