మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఉనికి ఉండనే ఉండదు, తప్పుడు ఫలితాలు చెప్పి ఫేక్ పార్టీగా మిగిలిందన్న శ్రీకాంత్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రభుత్వ విప్ శ్రీకాంత్రెడ్డి టీడీపీ పై విమర్శలు గుప్పించారు. ఫేక్ వెబ్సైట్ క్రియేట్..
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రభుత్వ విప్ శ్రీకాంత్రెడ్డి టీడీపీ పై విమర్శలు గుప్పించారు. ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి పంచాయతీ ఫలితాలపై తప్పుడు సమాచారం ఇస్తూ తెలుగుదేశంపార్టీ ఫేక్ పార్టీగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక ఇప్పుడు ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేస్తూ..డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. నామినేషన్లు వేస్తే చాలన్నట్లు టీడీపీ పరిస్థితి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఉనికి ఉండనే ఉండదని శ్రీకాంత్రెడ్డి తేల్చి చెప్పేశారు.
Read also : “Toolkit” ఇప్పుడీ పదం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. ఓ మహోద్యమాన్ని పక్కదారి పట్టించింది. అసలేంటిది.?