AP Election 2024: సార్వత్రిక ఎన్నికల బరిలో సామాన్యులు.. వారి ఆస్తులు ఎంతో తెలుసా..?

|

Apr 26, 2024 | 2:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో పేదలు సామాన్యులు తమ అదృష్టాన్ని ఎన్నికల్లో పరీక్షించు కోబోతున్నారు.కోట్లకు అధిపతులు ఎన్నికల బరిలో కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో దిగుతున్న వేళ ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలో వైసీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల అఫిడవిట్లు వారి పరిస్థితులు చూస్తే వీళ్ళ అసెంబ్లీ బరిలో నిలిచిన వారెనా అని ఆశ్చర్యపోకతప్పదు..!

AP Election 2024: సార్వత్రిక ఎన్నికల బరిలో సామాన్యులు.. వారి ఆస్తులు ఎంతో తెలుసా..?
Andhra Election
Follow us on

ఎన్నికలంటే కోటీశ్వరులు ఆపర కుబేరులకు మాత్రమే సాధ్యమని భావిస్తున్న ఈరోజుల్లో.. ఆంధ్రప్రదేశ్‌లో పేదలు సామాన్యులు తమ అదృష్టాన్ని ఎన్నికల్లో పరీక్షించు కోబోతున్నారు.కోట్లకు అధిపతులు ఎన్నికల బరిలో కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో దిగుతున్న వేళ ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలో వైసీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల అఫిడవిట్లు వారి పరిస్థితులు చూస్తే వీళ్ళ అసెంబ్లీ బరిలో నిలిచిన వారెనా అని ఆశ్చర్యపోకతప్పదు..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లు ఆస్తుల లెక్కలు చూస్తే కళ్ళు చెదరాల్సిందే! కోట్లకు అధిపతులు అసెంబ్లి పార్లమెంట్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ జనసేన తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల అఫిడవిట్లలో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తమ తమ నామినేషన్లలో అఫిడవిట్లు సమర్పించారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అఫిడవిట్లు చూస్తే కళ్లు చెదిరే స్థిరాస్తులు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు సమర్పించడంతో పాటు ఒక్కో అభ్యర్ధి తమకు రూ. 50 కోట్ల నుంచి స్థిర చర ఆస్తులు మొత్తం కలిపి రూ. 8 వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్ల సంధర్భంగా అఫిడవిట్లను సమర్పించడంతో ఇప్పుడు ఎపీ రాజకీయాల్లో నేతల ఆస్తుల వివరాలపై రాష్ట్ర వ్యాప్తంగా హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.

కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల బరిలో చాలామంది అభ్యర్థులు నిలిచిన వేళ కేవలం త ఖాతాలో మూడు అంకెల బ్యాంకు బ్యాలెన్స్ కూడా లేని అభ్యర్థులు వైసీపీ తరఫున ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అసెంబ్లీ అభ్యర్థులుగా బరిలోకి దిగినవారిలో ముందు వరుసలో ఉన్నారు. మైలవరం నియోజక వర్గం నుంచి అతి సాధారణమైన వ్యక్తిగా ఉన్న సార్ణాల తిరుపతిరావు. ప్రస్తుతం మైలవరం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిరుపతిరావు మొత్తం ఆస్తి 4,20,766 రూపాయలు మాత్రమే ఉన్నట్లుగా తన ఆపిడవిట్లో పేర్కొన్నారు. ఇక చరాస్తులకు సంబంధించి రూ.1,89,642 మాత్రమే ఉన్నాయని, ఇక బ్యాంక్ అకౌంట్ లో తొమ్మిది వేల రూపాయలతో పాటు ఒక బైక్ మాత్రమే ఉన్నట్లు ఆయన అఫిడవిట్ సమర్పించారు. మొత్తంగా తనకు సంబంధించి బంగారం రూ. 1,65,000, చేతిలో నగదు రూ.15,000 ఉన్నట్లుగా పేర్కొనడం విశేషం. ఈ ఎన్నికల్లో అతి సామాన్యుడిగా సార్నాల తిరుపతిరావు బరిలోకి దిగడం, పైగా అపర కుబేరుడుగా ఉన్న మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి కృష్ణ ప్రసాద్‌పై పోటీ చేస్తూ ఉండటంతో ప్రస్తుతం అందరి దృష్టి మైలవరంపై పడింది.

ఇక సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈర్లకప్పకు సొంత బైకు తప్ప ఎటువంటి స్థిర చర ఆస్తులు లేకపోవడం విశేషం. కేవలం 2,783 రూపాయలు మాత్రమే ఉన్నట్లు ఆయన అఫిడవిట్ సమర్పించారు. ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ప్రగతి గ్రామీణ బ్యాంకులో 11 రూపాయలు కెనరా బ్యాంకులో 41 రూపాయి ఏడీసీసీ బ్యాంకులో రూ. 26,950 రూపాయలు యూనియన్ బ్యాంకులో రూ. 881తో పాటు అప్పులు రూ.1,13,050 ఉన్నట్లు తెలిపారు. ఇందులో బ్యాంకు రుణం రూ. 86,100 కాగా, ఇతర అప్పులు రూ. 26,950 ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తంగా స్థిర చర ఆస్తులు కలిపి రూ. 99,883 మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు ఈర్లక్కప్ప. ప్రస్తుతం మడకశిర నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి ఎమ్మెస్ రాజు పోటీ చేస్తున్నారు.

మరోవైపు అనంతపురం జిల్లా సింగనమల ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఎం వీరాంజనేయులు కూడా అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆయన అసెంబ్లీ నుంచి బరిలో దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన సమర్పించిన అఫిడవీట్ ప్రకారం స్థిరాచరాస్తులకు సంబంధించి కేవలం 1,06,478 రూపాయలు మాత్రమే ఉన్నాయి. చేతిలో 50 వేల రూపాయలతో పాటు ఎస్‌బీఐలో 11,193 రూపాయలు, అలాగే ద్విచక్ర వాహనం మాత్రమే ఉన్నట్లు ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వీరాంజనేయులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న ఆయనను ఈ సార్వత్రిక ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగిపోతున్నారు.

ఇక పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అతి సామాన్యుడు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించు కోబోతున్నారు. పాడేరు అసెంబ్లీ నుంచి ఎం విశ్వేశ్వర రాజు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిలో 20,39,512 రూపాయలు మాత్రమే ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల పేరు మీద రూ. 7,25,927 అప్పులు రూ.1,20,000 స్థిరాచరాస్తులు కలిపి రూ. 50,98,000 మాత్రమే ఉన్నట్లు ఆయన ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…